(1 / 8)
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజులు గడుస్తున్నా లోపలి చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు.
(2 / 8)
14వ కిలోమీటరు వద్ద సొరంగంలో చిక్కుకున్న బాధితులను కాపాడటం అత్యంత సవాల్గా మారింది. మోకాళ్ల లోతు నీళ్లు, పైగా బురద ఉండటంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లటం సహాయక చర్యల సిబ్బంది ఇబ్బందికరంగా మారింది.
(AFP)(3 / 8)
టన్నెల్ బోరింగ్ మిషన్ వరకు వెళ్లిన రెస్య్యూ బృందాలు…. అక్కడ ఎక్కువ స్థాయిలో బురద నిండి ఉందని గుర్తించింది. దానికి అవతల బాధితులున్నారని భావించి కేకలు వేసినా.. ఎలాంటి సమాధానం రాలేదని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ తెలిపారు.
(AFP)(4 / 8)
సొరంగంలోకి మరింత లోతుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని…NDRF డిప్యూటీ కమాండెంట్ సుఖేందు దత్తా, చెప్పారు. ANIతో మాట్లాడిన ఆయన…
ప్రస్తుతం టన్నెల్ లోపల పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు రెస్పాన్స్ ఫోర్స్ పని చేస్తోందన్నారు. ప్రధానంగా లోకోమోటివ్ ట్రైన్, కన్వేయర్ బెల్ట్లను ఉపయోగించి సొరంగం లోపల 13.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పారు.
(Video Grab)(5 / 8)
"మేము టన్నెల్ బోరింగ్ మెషిన్ వరకు చేరుకున్నాము. మేము అరచి, చిక్కుకున్న కార్మికుల నుంచి ఏదైనా సమాధానం పొందడానికి ప్రయత్నించాము, కానీ దురదృష్టవశాత్తు మాకు ఏమీ తెలియలేదు ఎందుకంటే సుమారు 200 మీటర్ల మేర శిథిలాలతో నిండి ఉంది. శిధిలాలను తొలగించే వరకు మేము బాధితుల యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించలేము," NDRF డిప్యూటీ కమాండెంట్ చెప్పారు.
(HT_PRINT)(6 / 8)
"11 నుంచి 13 కిమీల మధ్య ఉన్న ప్రాంతం నీటితో నిండి ఉంది, కాబట్టి ప్రస్తుతం, మేము నీటిని తొలగించే ప్రక్రియలో ఉన్నాము. అది పూర్తయిన తర్వాత…. రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభిస్తాము" అని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ తెలిపారు. "
(PTI)(7 / 8)
ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరితే కానీ కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం రెస్యూ బృందాలు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆ ఆపరేషన్ ఎప్పటిలోపు పూర్తవుతుందనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.
(PTI)ఇతర గ్యాలరీలు