Tirumala Ratha Saptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీమన్నారయణుడు-ratha saptami celebrated grandly in tirumala sri malayappa swamy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Ratha Saptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీమన్నారయణుడు

Tirumala Ratha Saptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీమన్నారయణుడు

Feb 04, 2025, 09:49 AM IST Bolleddu Sarath Chandra
Feb 04, 2025, 09:49 AM , IST

  • Tirumala Ratha Saptami: సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

తిరుమలలో మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. 

(1 / 9)

తిరుమలలో మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. 

సూర్య ప్రభ వాహనంపై కొలువైన శ్రీమన్నారయణుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. 

(2 / 9)

సూర్య ప్రభ వాహనంపై కొలువైన శ్రీమన్నారయణుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. 

తెల్లవారు జాము నుంచి రథసప్తమి కోలాహలం కనిపించింది. రథసప్తమి నాడు శ్రీవారికి పలు వాహన సేవలు కల్పిస్తారు. ఈ వేడుకల్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. 

(3 / 9)

తెల్లవారు జాము నుంచి రథసప్తమి కోలాహలం కనిపించింది. రథసప్తమి నాడు శ్రీవారికి పలు వాహన సేవలు కల్పిస్తారు. ఈ వేడుకల్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. 

రథ సప్తమి వేడుకల్ని తిలకించేందకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తిరుమల మాడవీధులు కిటకిటలాడాయి. 

(4 / 9)

రథ సప్తమి వేడుకల్ని తిలకించేందకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తిరుమల మాడవీధులు కిటకిటలాడాయి. 

రథ సప్తమి పురస్కరించుకుని  సూర్య భగవానుడి రూపంలో చిన్నారుల అలంకరణ

(5 / 9)

రథ సప్తమి పురస్కరించుకుని  సూర్య భగవానుడి రూపంలో చిన్నారుల అలంకరణ

రథ సప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రం విద్యుత్ కాంతులతో ధగధగలాడింది. 

(6 / 9)

రథ సప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రం విద్యుత్ కాంతులతో ధగధగలాడింది. 

సూర్యప్రభ వాహనంపై ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు విహరించారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

(7 / 9)

సూర్యప్రభ వాహనంపై ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు విహరించారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.  రథ సప్తమి వేడుకల్లో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.  

(8 / 9)

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.  రథ సప్తమి వేడుకల్లో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. 
 

ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

(9 / 9)

ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు