'రామగుండం రైల్వే స్టేషన్' రూపురేఖలు మారాయి..! ఈ కొత్త ఫొటోలు చూడండి-ramagundam railway station development works 90 percent completed latest photos see here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'రామగుండం రైల్వే స్టేషన్' రూపురేఖలు మారాయి..! ఈ కొత్త ఫొటోలు చూడండి

'రామగుండం రైల్వే స్టేషన్' రూపురేఖలు మారాయి..! ఈ కొత్త ఫొటోలు చూడండి

Published Apr 19, 2025 09:24 AM IST Maheshwaram Mahendra Chary
Published Apr 19, 2025 09:24 AM IST

  • తెలంగాణలోని రామగుండం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద అభివృద్ధి పనులను చేపట్టారు. 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన తాజా ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు.

ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని రామగుండం రైల్వే స్టేషన్ ను ఆధునీకరించింది.

(1 / 7)

ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని రామగుండం రైల్వే స్టేషన్ ను ఆధునీకరించింది.

ఆధునీకరణ పనులతో రామగుండం రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.26.49 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.

(2 / 7)

ఆధునీకరణ పనులతో రామగుండం రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.26.49 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.

ప్లాట్‌ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు కూర్చునేందుకు స్టేషన్‌లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

(3 / 7)

ప్లాట్‌ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు కూర్చునేందుకు స్టేషన్‌లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

రైల్వే స్టేషన్‌ ముందు భాగంలో ప్రయాణికులను ఆకట్టుకునేలా ఎలివేషన్‌తో పాటు వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం సిద్ధం చేశారు.

(4 / 7)

రైల్వే స్టేషన్‌ ముందు భాగంలో ప్రయాణికులను ఆకట్టుకునేలా ఎలివేషన్‌తో పాటు వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం సిద్ధం చేశారు.

ఎయిర్‌పోర్టు తరహాలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ లో 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని సిద్ధం చేశారు.

(5 / 7)

ఎయిర్‌పోర్టు తరహాలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ లో 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని సిద్ధం చేశారు.

రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు అధునాతన లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త టాయిలెట్లు, ఆధునిక క్యాంటీన్, వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. మొత్తం 2 లిఫ్ట్ లు, 3 ఎస్కులేటర్లను ఏర్పాటు చేశారు.

(6 / 7)

రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు అధునాతన లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త టాయిలెట్లు, ఆధునిక క్యాంటీన్, వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. మొత్తం 2 లిఫ్ట్ లు, 3 ఎస్కులేటర్లను ఏర్పాటు చేశారు.

మిగతా 20 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయి.

(7 / 7)

మిగతా 20 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు