(1 / 7)
ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని రామగుండం రైల్వే స్టేషన్ ను ఆధునీకరించింది.
(2 / 7)
ఆధునీకరణ పనులతో రామగుండం రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.26.49 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
(3 / 7)
ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు కూర్చునేందుకు స్టేషన్లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్ బుకింగ్ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
(4 / 7)
రైల్వే స్టేషన్ ముందు భాగంలో ప్రయాణికులను ఆకట్టుకునేలా ఎలివేషన్తో పాటు వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు.
(5 / 7)
ఎయిర్పోర్టు తరహాలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ లో 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్బ్రిడ్జిని సిద్ధం చేశారు.
(6 / 7)
రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫాంపైకి చేరుకునేందుకు అధునాతన లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త టాయిలెట్లు, ఆధునిక క్యాంటీన్, వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. మొత్తం 2 లిఫ్ట్ లు, 3 ఎస్కులేటర్లను ఏర్పాటు చేశారు.
ఇతర గ్యాలరీలు