చివరి క్షణంలో రాజా రఘువంశీని చంపడానికి ఆలోచించిన హంతకులు.. రూ.15 లక్షలు ఆఫర్ చేసిన సోనమ్!-raja raghuwanshi murder case sonam raghuwanshi lover raj didnt go to meghalaya and sonam offer more money to killers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చివరి క్షణంలో రాజా రఘువంశీని చంపడానికి ఆలోచించిన హంతకులు.. రూ.15 లక్షలు ఆఫర్ చేసిన సోనమ్!

చివరి క్షణంలో రాజా రఘువంశీని చంపడానికి ఆలోచించిన హంతకులు.. రూ.15 లక్షలు ఆఫర్ చేసిన సోనమ్!

Published Jun 11, 2025 03:13 PM IST Anand Sai
Published Jun 11, 2025 03:13 PM IST

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎలాగైనా చంపించాలని భార్య సోనమ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె ప్రియడు రాజ్ కుష్వాహ కుటుంబ సభ్యులు తమవాడు అమాయకుడు అని చెబుతున్నారు.

సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా అమాయకుడని, నేరం జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజ్ సోదరి మాట్లాడుతూ.. 'మా తమ్ముడు ఎక్కడికీ వెళ్లలేదు. ఆఫీసులోని వాళ్లను అడగవచ్చు. నా సోదరుడిని విడుదల చేయాలనేది నా డిమాండ్. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదు.' అని చెప్పింది.

(1 / 4)

సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా అమాయకుడని, నేరం జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజ్ సోదరి మాట్లాడుతూ.. 'మా తమ్ముడు ఎక్కడికీ వెళ్లలేదు. ఆఫీసులోని వాళ్లను అడగవచ్చు. నా సోదరుడిని విడుదల చేయాలనేది నా డిమాండ్. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదు.' అని చెప్పింది.

తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్ కుష్వాహా తల్లి మీడియాకు తెలిపారు. 'నా కొడుకు అలా చేయడు. వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. నా కొడుకు సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.' అని చెప్పారు. రాజ్ కుష్వాహాతో సోనమ్ తరచూ మాట్లాడేదని రాజా రఘువంశీ సోదరుడు ఆరోపించారు.

(2 / 4)

తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్ కుష్వాహా తల్లి మీడియాకు తెలిపారు. 'నా కొడుకు అలా చేయడు. వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. నా కొడుకు సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.' అని చెప్పారు. రాజ్ కుష్వాహాతో సోనమ్ తరచూ మాట్లాడేదని రాజా రఘువంశీ సోదరుడు ఆరోపించారు.

(PTI)

సోనమ్‌కు సపోర్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, చివరి నిమిషంలో మేఘాలయకు వెళ్లే ప్రణాళికను రాజ్ కుష్వాహ రద్దు చేసుకున్నట్లు విచారణలో పాల్గొన్న ఇండోర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన ముగ్గురిని కూడా వెళ్లకుండా వద్దని చెప్పాడు. అయితే సోనమ్ టికెట్ కొన్న తర్వాత వారు మేఘాలయకు వెళ్లారు. చివరి క్షణంలో ముగ్గురూ చంపడానికి నిరాకరించినప్పటికీ సోనమ్ పట్టుబట్టి రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ వాదనలను పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.

(3 / 4)

సోనమ్‌కు సపోర్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, చివరి నిమిషంలో మేఘాలయకు వెళ్లే ప్రణాళికను రాజ్ కుష్వాహ రద్దు చేసుకున్నట్లు విచారణలో పాల్గొన్న ఇండోర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన ముగ్గురిని కూడా వెళ్లకుండా వద్దని చెప్పాడు. అయితే సోనమ్ టికెట్ కొన్న తర్వాత వారు మేఘాలయకు వెళ్లారు. చివరి క్షణంలో ముగ్గురూ చంపడానికి నిరాకరించినప్పటికీ సోనమ్ పట్టుబట్టి రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ వాదనలను పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.

(ANI X)

మే 23న సోనమ్, రాజా కనిపించకుండా పోయారు. జూన్ 2న మేఘాలయలో ఓ లోయలో కుళ్లిపోయిన స్థితిలో రాజా మృతదేహం లభ్యమైంది. జూన్ 9న సోనమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనమ్ తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. సోనమ్ తనను తాను బాధితురాలిగా పోలీసుల ముందు చూపించే ప్రయత్నం చేసింది.

(4 / 4)

మే 23న సోనమ్, రాజా కనిపించకుండా పోయారు. జూన్ 2న మేఘాలయలో ఓ లోయలో కుళ్లిపోయిన స్థితిలో రాజా మృతదేహం లభ్యమైంది. జూన్ 9న సోనమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనమ్ తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. సోనమ్ తనను తాను బాధితురాలిగా పోలీసుల ముందు చూపించే ప్రయత్నం చేసింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు