(1 / 5)
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ గ్రూప్ మెంబర్స్, ఇతర అఫీషియల్స్ ధర్మశాల నుంచి ఢిల్లీకి ట్రైన్లో వెళ్లారు. వీళ్ల కోసం స్పెషల్ గా వందే భారత్ రైలును ఏర్పాటు చేశారు.
(x/ipl)(2 / 5)
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో గురువారం (మే 8) జరగాల్సిన మ్యాచ్ ను మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. భారత్, పాక్ మధ్య యుద్ధం కారణంగా ఈ మ్యాచ్ ను ఆపేశారు.
(x/ipl)(3 / 5)
భారత్, పాక్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా ధర్మశాల విమానాశ్రయాన్ని మూసేశారు. దీంతో ఆటగాళ్లను రైలు మార్గంలో ఢిల్లీ తరలించాల్సి వచ్చింది. హోటల్ నుంచి సమీపంలో రైల్వే స్టేషయానికి చిన్న చిన్న వెహికల్స్ లో ఆటగాళ్లను పంపించారు. అక్కడి నుంచి ఢిల్లీకి నేరుగా రైల్లో వెళ్లారు.
(x/ipl)(4 / 5)
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు రైల్లో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో డాక్యుమెంటరీని ఐపీఎల్ ఎక్స్ లో పోస్టు చేసింది. ఇందులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు డుప్లెసిస్, కుల్ దీప్ యాదవ్ కనిపించారు.
(x/ipl)(5 / 5)
ఎప్పుడూ విమానలు, స్పెషల్ ఫ్లైట్లలో విలాసవంతమైన జర్నీ చేసే ఆటగాళ్లు ఇలా రైల్లో వెళ్లడం చాలా అరుదు. కానీ ఇప్పుడు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లను రైల్లో పంపించిన బీసీసీఐకి, రైల్వే మంత్రిత్వ శాఖకు కుల్ దీప్ ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ 2025ను వారం పాటు బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
(x/ipl)ఇతర గ్యాలరీలు