PM Modi: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ‘పరస్పర ఆహ్వానం’: కీలక విషయాలివే
- PM Narendra Modi: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా (Fumio Kishida).. భారత పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. దైపాక్షిక అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించుకున్నారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనుండగా.. జపాన్ వేదికగా జీ7 సమ్మిట్ జరగనుంది.
- PM Narendra Modi: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా (Fumio Kishida).. భారత పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. దైపాక్షిక అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించుకున్నారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనుండగా.. జపాన్ వేదికగా జీ7 సమ్మిట్ జరగనుంది.
(1 / 8)
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జపాన్ ప్రధాని ఫుమియో కుషిదాతో సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.(ANI/PIB)
(2 / 8)
ఈ ఏడాది జపాన్లో జరగనున్న జీ7 సదస్సుకు తనను ఆహ్వానించినందుకు కుషిదాకు కృతజ్ఞతలు చెప్పారు మోదీ. (PTI)
(3 / 8)
“మేలో హిరోషిమాలో జరగనున్న జీ7 లీడర్స్ సదస్సుకు రావాలని జపాన్ ప్రధాని ఫుమియో కుషిదా నేను నన్ను ఆహ్వానించారు. దీనికి నేను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా” అని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.(PTI)
(4 / 8)
“నేను జపాన్ ప్రధాని ఫుమియో కుషిదాను ఆహ్వానించా. గత సంవత్సరంగా జపాన్ ప్రధానిని పలుమార్లు కలిశాను. ఇండియా-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఆయన సానుకూలతను, నిబద్ధతను ప్రతీసారి గుర్తించా. సంబంధాలు మెరుగ్గా కొనసాగేందుకు ఆయన నేటి పర్యటన మరింత దోహదం చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు. (PTI)
(5 / 8)
భారత్లో ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ20 సదస్సుకు జపాన్ ప్రధానిని ఆహ్వానించినట్టు భారత పీఎం మోదీ తెలిపారు. (AP)
(7 / 8)
జీ20 ప్రాధాన్యతల గురించి ఫుమియో కిషిదాతో చర్చించినట్టు ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ సౌత్ స్వరాన్ని వినిపించడమే తమ ధ్యేయమని తెలిపారు. (ANI)
ఇతర గ్యాలరీలు