‘మాటలకు అందని విషాదం’- ఎయిరిండియా విమాన ప్రమాదం సైట్​ దగ్గర ప్రధాని మోదీ..-pm modi meets air india plane crash survivors and visits accident site ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ‘మాటలకు అందని విషాదం’- ఎయిరిండియా విమాన ప్రమాదం సైట్​ దగ్గర ప్రధాని మోదీ..

‘మాటలకు అందని విషాదం’- ఎయిరిండియా విమాన ప్రమాదం సైట్​ దగ్గర ప్రధాని మోదీ..

Published Jun 13, 2025 11:02 AM IST Sharath Chitturi
Published Jun 13, 2025 11:02 AM IST

అహ్మదాబాద్​లోని ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 260 దాటింది. 25మంది గాయపడ్డారు. కాగా, శుక్రవారం ఉదయం అహ్మదాబాద్​కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఘటనాస్థలంతో పాటు క్షతగాత్రులు ఉన్న ఆసుపత్రిని సందర్శించారు.

శుక్రవారం ఉదయం అహ్మదాబాద్​కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

(1 / 5)

శుక్రవారం ఉదయం అహ్మదాబాద్​కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

(PMO)

ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్​ని ప్రధానమంత్రి మోదీ పరామర్శించారు.

(2 / 5)

ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్​ని ప్రధానమంత్రి మోదీ పరామర్శించారు.

(PMO)

“ఇది మాటలకు అందని విషాదం. అనూహ్యంగా ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. మీ బాధను మేము అర్థం చేసుకోగలము. మీ జీవితంలో ఏర్పడిన లోటును అర్థం చేసుకోగలము,” అని ప్రధాని మోదీ అన్నారు.

(3 / 5)

“ఇది మాటలకు అందని విషాదం. అనూహ్యంగా ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. మీ బాధను మేము అర్థం చేసుకోగలము. మీ జీవితంలో ఏర్పడిన లోటును అర్థం చేసుకోగలము,” అని ప్రధాని మోదీ అన్నారు.

(PMO)

ఆసుపత్రిలో క్షతగాత్రులను కలవడంతో పాటు అహ్మదాబాద్​ విమానశ్రయం సమీపంలో ఎయిరిండియా విమానం కూలిన ప్రాంతాన్ని సైతం మోదీ సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

(4 / 5)

ఆసుపత్రిలో క్షతగాత్రులను కలవడంతో పాటు అహ్మదాబాద్​ విమానశ్రయం సమీపంలో ఎయిరిండియా విమానం కూలిన ప్రాంతాన్ని సైతం మోదీ సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విమానం కూలిన ప్రాంతం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

(5 / 5)

విమానం కూలిన ప్రాంతం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు