PM Kisan Status check : రైతుల అకౌంట్లలో డబ్బులు, పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-pm kisan 19th installment how to check if the money is credited to your account ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Kisan Status Check : రైతుల అకౌంట్లలో డబ్బులు, పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Status check : రైతుల అకౌంట్లలో డబ్బులు, పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Published Feb 24, 2025 07:11 PM IST Bandaru Satyaprasad
Published Feb 24, 2025 07:11 PM IST

PM Kisan Funds check : రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయ్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ 19వ వితడ నిధులు ఖాతాల్లో జమ అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.

రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ 19వ వితడ నిధులు ఖాతాల్లో జమ అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద నిధులు విడుదల చేశారు.  9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేశారు.

(1 / 6)

రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ 19వ వితడ నిధులు ఖాతాల్లో జమ అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద నిధులు విడుదల చేశారు.  9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేశారు.

దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ విధానంలో రూ.22,000 కోట్లు రైతులు ఆర్థిక సహాయంగా అందుకుంటారు.  

(2 / 6)

దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ విధానంలో రూ.22,000 కోట్లు రైతులు ఆర్థిక సహాయంగా అందుకుంటారు.  

పీఎం కిసాన్ పథకాన్ని రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద, సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం, మూడు సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్ ద్వారా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. 

(3 / 6)

పీఎం కిసాన్ పథకాన్ని రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద, సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం, మూడు సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్ ద్వారా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. 

రైతులకు ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తారు. 19వ విడత పీఎం కిసాన్ డ‌బ్బు ఖాతాలో జ‌మ‌య్యిందా? లేదో? ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు. 

(4 / 6)

రైతులకు ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తారు. 19వ విడత పీఎం కిసాన్ డ‌బ్బు ఖాతాలో జ‌మ‌య్యిందా? లేదో? ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు. 

1. పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ను సందర్శించాలి.  2. కుడి వైపున క‌నిపిస్తున్న ఫార్మర్ కార్నర్ ఆప్షన్ లో  బెనిఫిషియ‌రీ స్టేట‌స్ ఆప్షన్ ఉంటుంది3. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేసి ఆధార్ లేదా ఖాతా నెంబ‌రును ఎంట‌ర్ చేసి 'గెట్ డేటా'పై క్లిక్ చేయాలి.4.స్క్రీన్‌పై స్టేట‌స్ క‌నిపిస్తుంది. పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకుని, ఈకేవైసీ పూర్తి చేస్తే ఖాతాలోకి డ‌బ్బు జమ అవుతాయి. 

(5 / 6)

1. పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ను సందర్శించాలి.  
2. కుడి వైపున క‌నిపిస్తున్న ఫార్మర్ కార్నర్ ఆప్షన్ లో  బెనిఫిషియ‌రీ స్టేట‌స్ ఆప్షన్ ఉంటుంది
3. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేసి ఆధార్ లేదా ఖాతా నెంబ‌రును ఎంట‌ర్ చేసి 'గెట్ డేటా'పై క్లిక్ చేయాలి.
4.స్క్రీన్‌పై స్టేట‌స్ క‌నిపిస్తుంది. పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకుని, ఈకేవైసీ పూర్తి చేస్తే ఖాతాలోకి డ‌బ్బు జమ అవుతాయి. 

ల‌బ్ధిదారుల జాబితాలో పేరు ఉందో? లేదో? కూడా చెక్ చేసుకోవ‌చ్చు. బెనిఫిషియ‌రీ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మ‌రొక పేజీ ఓపెన్ అవుతుంది.  ఇక్కడ ల‌బ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాల‌ను ఎంచుకుని గెట్ రిపోర్టుపై క్లిక్ చేస్తే ల‌బ్ధిదారుల జాబితా డిస్ ప్లే అవుతుంది. 

(6 / 6)

ల‌బ్ధిదారుల జాబితాలో పేరు ఉందో? లేదో? కూడా చెక్ చేసుకోవ‌చ్చు. బెనిఫిషియ‌రీ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మ‌రొక పేజీ ఓపెన్ అవుతుంది.  ఇక్కడ ల‌బ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాల‌ను ఎంచుకుని గెట్ రిపోర్టుపై క్లిక్ చేస్తే ల‌బ్ధిదారుల జాబితా డిస్ ప్లే అవుతుంది. 

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు