Mahakumbh Mela Stampede : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఫొటోలు-pics after maha kumbh stampede during amrit snan see photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahakumbh Mela Stampede : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఫొటోలు

Mahakumbh Mela Stampede : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఫొటోలు

Jan 29, 2025, 01:51 PM IST Anand Sai
Jan 29, 2025, 01:51 PM , IST

  • Mahakumbh Mela Stampede : ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన మహా కుంభమేళాలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అమృత స్నానాలు రద్దు చేశారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా అర్ధరాత్రి ఒంటిగంటకు తొక్కిసలాట జరిగింది. ఘాట్ వద్ద అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది.

(1 / 7)

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా అర్ధరాత్రి ఒంటిగంటకు తొక్కిసలాట జరిగింది. ఘాట్ వద్ద అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది.

(HT Photo/Deepak Gupta)

మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్నానానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ధృవీకరించలేదు. ప్రమాదంలో గాయపడిన పలువురిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

(2 / 7)

మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్నానానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ధృవీకరించలేదు. ప్రమాదంలో గాయపడిన పలువురిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

(HT Photo/Deepak Gupta)

రాత్రి సమయంలో అకస్మాత్తుగా జనం గుమిగూడడంతో పెద్ద దుమారం రేగడంతో తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను అంబులెన్స్ ల సహాయంతో తరలించారు.

(3 / 7)

రాత్రి సమయంలో అకస్మాత్తుగా జనం గుమిగూడడంతో పెద్ద దుమారం రేగడంతో తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను అంబులెన్స్ ల సహాయంతో తరలించారు.

(HT Photo/Deepak Gupta)

త్రివేణి సంగమం వద్ద భారీగా జనం గుమికూడడంతో భద్రతా సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది.

(4 / 7)

త్రివేణి సంగమం వద్ద భారీగా జనం గుమికూడడంతో భద్రతా సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది.

(HT Photo/Deepak Gupta)

క్షతగాత్రులను మహాకుంభ్‌లోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియరాలేదు. తొక్కిసలాట తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

(5 / 7)

క్షతగాత్రులను మహాకుంభ్‌లోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియరాలేదు. తొక్కిసలాట తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

(HT Photo/Deepak Gupta)

అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని స్నానాలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని, బసంత్ పంచమి నాడు స్నానాలు ఉంటాయని అన్నారు. 

(6 / 7)

అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని స్నానాలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని, బసంత్ పంచమి నాడు స్నానాలు ఉంటాయని అన్నారు. 

(PTI Photo)

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో సరుకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి కోసం జనాలు వెత్తుకోవడం కనిపించింది.

(7 / 7)

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో సరుకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి కోసం జనాలు వెత్తుకోవడం కనిపించింది.

(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు