గోదావరిలో పెరుగుతున్న వరద - పాపికొండల విహారయాత్రకు బ్రేక్..!-papikondalu boat tour temporarily suspended duw to godavari flood levels rises ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  గోదావరిలో పెరుగుతున్న వరద - పాపికొండల విహారయాత్రకు బ్రేక్..!

గోదావరిలో పెరుగుతున్న వరద - పాపికొండల విహారయాత్రకు బ్రేక్..!

Published Jul 02, 2025 11:32 AM IST Maheshwaram Mahendra Chary
Published Jul 02, 2025 11:32 AM IST

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాపికొండల్లో బోట్ ఆపరేషన్లను నిలిపివేశారు. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ ప్రకటన విడుదల చేసింది.

ఏపీలోని పాపికొండలను చూసేందుకు చాలా మంది పర్యాటకులు తరలివస్తుంటారు. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన పర్వత శ్రేణిగా  ఇవి ఉంటాయి. ఇవి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి.

(1 / 7)

ఏపీలోని పాపికొండలను చూసేందుకు చాలా మంది పర్యాటకులు తరలివస్తుంటారు. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన పర్వత శ్రేణిగా ఇవి ఉంటాయి. ఇవి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి.

(Image Source AP Tourism)

పాపికొండలు చూసేందుకు రాజమండ్రి లేదా భద్రాచలం నుంచి వెళ్లొచ్చు. రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచిలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా వుంటుంది.

(2 / 7)

పాపికొండలు చూసేందుకు రాజమండ్రి లేదా భద్రాచలం నుంచి వెళ్లొచ్చు.

రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచిలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా వుంటుంది.

అయితే ప్రతి ఏడాది కూడా వరద సమయంలో ఈ యాత్రపై ఆంక్షలు విధిస్తున్నారు. గతంలో జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. తాజాగా వర్షాకాలం రావటంతో….గోదావరిలో వరద మొదలైంది. నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

(3 / 7)

అయితే ప్రతి ఏడాది కూడా వరద సమయంలో ఈ యాత్రపై ఆంక్షలు విధిస్తున్నారు. గతంలో జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. తాజాగా వర్షాకాలం రావటంతో….గోదావరిలో వరద మొదలైంది. నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

(Image Source AP Tourism)

తాజాగా విహారయాత్రపై ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అల్లూరి జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షంతో పాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాపికొండల విహార యాత్రకు బ్రేకులు పడినట్లు అయింది.

(4 / 7)

తాజాగా విహారయాత్రపై ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అల్లూరి జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షంతో పాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాపికొండల విహార యాత్రకు బ్రేకులు పడినట్లు అయింది.

2018లో పాపికొండల విహార యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.‌ 2019 సెప్టెంబరు నెలలో కచ్చలూరు బోటు ప్రమాదం తరువాత పాపికొండల విహార యాత్రను ప్రభుత్వం నిషేధించింది. తిరిగి 2021 నవంబర్ 7వ తేదీన పాపికొండల విహారయాత్రను ప్రారంభించారు. అయితే ఆ ప్రమాదం కొన్ని గుణపాఠాలు నేర్పింది. దీంతో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పాపికొండల విహార యాత్రను రద్దు చేసున్నారు.

(5 / 7)

2018లో పాపికొండల విహార యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.‌ 2019 సెప్టెంబరు నెలలో కచ్చలూరు బోటు ప్రమాదం తరువాత పాపికొండల విహార యాత్రను ప్రభుత్వం నిషేధించింది. తిరిగి 2021 నవంబర్ 7వ తేదీన పాపికొండల విహారయాత్రను ప్రారంభించారు. అయితే ఆ ప్రమాదం కొన్ని గుణపాఠాలు నేర్పింది. దీంతో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పాపికొండల విహార యాత్రను రద్దు చేసున్నారు.

జాతీయ వనంగా గుర్తింపు పొందిన పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాగే తెలంగాణలోని భద్రాచలానికి కూడా దాదాపుగా అదే దూరం ఉంటుంది. రెండు పర్వత శ్రేణులుగా ఉండే పాపికొండల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.

(6 / 7)

జాతీయ వనంగా గుర్తింపు పొందిన పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాగే తెలంగాణలోని భద్రాచలానికి కూడా దాదాపుగా అదే దూరం ఉంటుంది. రెండు పర్వత శ్రేణులుగా ఉండే పాపికొండల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.

(Image Source AP Tourism)

మళ్లీ గోదావరిలో వరద తగ్గముఖం పట్టి… నిలకడగా ఉన్న సమయంలోనే రాకపోకలకు అనుమతులు వస్తాయి.అప్పటి వరకు పాపికొండల విహార యాత్ర నిలిపివేస్తారు.

(7 / 7)

మళ్లీ గోదావరిలో వరద తగ్గముఖం పట్టి… నిలకడగా ఉన్న సమయంలోనే రాకపోకలకు అనుమతులు వస్తాయి.అప్పటి వరకు పాపికొండల విహార యాత్ర నిలిపివేస్తారు.

(image source @TravelTelangana)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు