శ్రీరామ నవమి సందర్భంగా దీపాల కాంతుల్లో అయోధ్య.. ఫొటోలు చూసేయండి!-on the occasion of ram navami ayodhya ghats lit up with light of lamps see photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శ్రీరామ నవమి సందర్భంగా దీపాల కాంతుల్లో అయోధ్య.. ఫొటోలు చూసేయండి!

శ్రీరామ నవమి సందర్భంగా దీపాల కాంతుల్లో అయోధ్య.. ఫొటోలు చూసేయండి!

Published Apr 06, 2025 09:47 PM IST Anand Sai
Published Apr 06, 2025 09:47 PM IST

Sri Ram Navami 2025 : దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణం చూసి భక్తులందరూ తరించిపోయారు. మరోవైపు సాయంత్రం కాగానే అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలిగిపోయింది.

రామనవమి సందర్భంగా అయోధ్య నగరం భక్తిలో మునిగిపోయింది. దీపాల కాంతుల్లో వెలిగింది. ఆదివారం సాయంత్రం సరయు నది ఒడ్డున రెండు లక్షల దీపాల కాంతితో అయోధ్య మెరిసింది.

(1 / 5)

రామనవమి సందర్భంగా అయోధ్య నగరం భక్తిలో మునిగిపోయింది. దీపాల కాంతుల్లో వెలిగింది. ఆదివారం సాయంత్రం సరయు నది ఒడ్డున రెండు లక్షల దీపాల కాంతితో అయోధ్య మెరిసింది.

ఈ ప్రత్యేక సందర్భంగా అయోధ్యను ఘనంగా అలంకరించారు. ప్రతి వీధి, ప్రతి కూడలి, ప్రతి ఆలయం మొత్తం నగరం రామ నామ స్మరణతో నిండిపోయింది.

(2 / 5)

ఈ ప్రత్యేక సందర్భంగా అయోధ్యను ఘనంగా అలంకరించారు. ప్రతి వీధి, ప్రతి కూడలి, ప్రతి ఆలయం మొత్తం నగరం రామ నామ స్మరణతో నిండిపోయింది.

శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం ప్రకాశవంతమైన సూర్య కిరణాలు బాల రామ్ లల్లా నుదిటిపై సూర్య తిలకం రూపంలో కనిపించాయి. ఇది చూసేందుకు కన్నుల విందుగా కనిపించింది.

(3 / 5)

శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం ప్రకాశవంతమైన సూర్య కిరణాలు బాల రామ్ లల్లా నుదిటిపై సూర్య తిలకం రూపంలో కనిపించాయి. ఇది చూసేందుకు కన్నుల విందుగా కనిపించింది.

సాయంత్రం సమీపిస్తున్న కొద్దీ చౌదరి చరణ్ సింగ్ ఘాట్ దాదాపు రెండున్నర లక్షల దీపాలతో ప్రకాశవంతంగా మారింది.

(4 / 5)

సాయంత్రం సమీపిస్తున్న కొద్దీ చౌదరి చరణ్ సింగ్ ఘాట్ దాదాపు రెండున్నర లక్షల దీపాలతో ప్రకాశవంతంగా మారింది.

రామనవమి సందర్భంగా అయోధ్య నగరం భక్తి, ఆనందంలో మునిగిపోయింది. ఆదివారం సాయంత్రం సరయు నది ఒడ్డున రెండు లక్షల దీపాలు వెలిగించిన అద్భుతమైన దృశ్యం అయోధ్యను ప్రకాశవంతంగా చేసింది.

(5 / 5)

రామనవమి సందర్భంగా అయోధ్య నగరం భక్తి, ఆనందంలో మునిగిపోయింది. ఆదివారం సాయంత్రం సరయు నది ఒడ్డున రెండు లక్షల దీపాలు వెలిగించిన అద్భుతమైన దృశ్యం అయోధ్యను ప్రకాశవంతంగా చేసింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు