(1 / 6)
హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
(2 / 6)
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 31 పోస్టులను భర్తీ చేస్తారు. జియో ఇన్ఫర్మాటిక్స్ విభాగంలో అత్యధికంగా 10 పోస్టులు ఉన్నాయి.ఆయా పోస్టులను బట్టి… విద్యా అర్హతలను నిర్ణయించారు. ఈ వివరాలను https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.
(3 / 6)
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు తెలంగాణలోని NRSC కేంద్రం షాద్ నగర్ తో పాటు ఢిల్లీ. బెంగళూరు. నాగపూర్, కోల్ కత్తా, జోద్ పూర్ యూనిట్లలోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
(4 / 6)
ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 మధ్య జీతం చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు మే 30, 2025లోపు అప్లికేషన్ చేసుకోవాలి.
(5 / 6)
ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూల కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. అహ్మదాబాద్, బెంగలూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై,జోద్ ఫూర్, కోల్ కత్తా, తిరువనంతపురం కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
(6 / 6)
ఈ ఉద్యోగాలకు https://apps.nrsc.gov.in/eRecruitment_NRSC/ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే recruit@nrsc.gov.in కు మెయిల్ చేయవచ్చు.
ఇతర గ్యాలరీలు