(1 / 5)
ఏపీలో చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన చాలా మందికి రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేృతృత్వంలోని ప్రభుత్వం… కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టిపెట్టింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది.
(2 / 5)
రేపు (అక్టోబర్ 10) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందులో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
(3 / 5)
కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అడ్రస్ ఛేంజ్ తో పాటు కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు వంటి వాటిపై కూడా చర్చించనున్నారు.
(4 / 5)
రాష్ట్రంలో ఆరు వేలకుపైగా రేషన్ డీలర్లను కూడా భర్తీ చేసేందుకు కూడా ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా 4 వేలకు పైగా రేషన్ దుకాణాలు కూడా ఏర్పాటు చేసే విషయంపై కేబినెట్ లో చర్చించనున్నారు.
(5 / 5)
మరోవైపు కొత్త రేషన్ కార్డుల డిజైన్లను కూడా పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది. త్వరలోనే తుది డిజైన్ ను ఖరారు చేయనుంది. ఆ వెంటనే కార్డుల జారీ కోసం ప్రకటన వెలువడనుంది. అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట.. తప్పనిసరిగా మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి మంత్రివర్గం సమావేశంలో వీటన్నింటిపై చర్చించే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు