ఆగస్ట్​ 3న నీట్​ పీజీ 2025- ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే..-neet pg 2025 exam to be held on august 3 see important dates ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆగస్ట్​ 3న నీట్​ పీజీ 2025- ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే..

ఆగస్ట్​ 3న నీట్​ పీజీ 2025- ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే..

Published Jun 08, 2025 10:11 AM IST Sharath Chitturi
Published Jun 08, 2025 10:11 AM IST

నీట్​ పీజీ 2025 పరీక్షకు సంబంధించిన రివైజ్డ్​ షెడ్యూల్​ని నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్​ ఇన్​ మెడికల్​ సైసెన్స్​ (ఎన్​బీఈఎంఎస్​) తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు natboard.edu.in వద్ద షెడ్యూల్​ని చెక్​ చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి..

రివైజ్డ్​ షెడ్యూల్​ ప్రకారం ఆగస్ట్​ 3న సింగిల్​ షిఫ్ట్​లో నీట్​ పీజీ 2025 పరీక్ష జరగనుంది. ఒకే షిఫ్ట్​లో పరీక్ష జరుగుతున్నందున అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాలు, నగరాల సంఖ్యను అధికారులు పెంచనున్నారు.

(1 / 5)

రివైజ్డ్​ షెడ్యూల్​ ప్రకారం ఆగస్ట్​ 3న సింగిల్​ షిఫ్ట్​లో నీట్​ పీజీ 2025 పరీక్ష జరగనుంది. ఒకే షిఫ్ట్​లో పరీక్ష జరుగుతున్నందున అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాలు, నగరాల సంఖ్యను అధికారులు పెంచనున్నారు.

ఫలితంగా అభ్యర్థులు తమ ఎగ్జామ్​ సిటీల ఛాయిస్​ని రీ- సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అబ్లికేషన్​ ఫామ్​ జూన్​ 13 నుంచి జూన్​ 17 వరకు అందుబాటులో ఉంటుంది. అనంతరం నగరం వివరాలను అడ్మిట్​ కార్డులో వెల్లడిస్తారు.

(2 / 5)

ఫలితంగా అభ్యర్థులు తమ ఎగ్జామ్​ సిటీల ఛాయిస్​ని రీ- సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అబ్లికేషన్​ ఫామ్​ జూన్​ 13 నుంచి జూన్​ 17 వరకు అందుబాటులో ఉంటుంది. అనంతరం నగరం వివరాలను అడ్మిట్​ కార్డులో వెల్లడిస్తారు.

(HT_PRINT)

జూన్​ 20న నీట్​ పీజీ 2025 ఎడిట్​ విండో అందుబాటులో ఉంటుంది. జూన్​ 22న మూతపడుతుంది. జులై 21న ఎగ్జామ సిటీ వివరాలను ప్రకటిస్తారు. జులై 31న అడ్మిట్​ కార్డులు విడుదల అవుతాయి.

(3 / 5)

జూన్​ 20న నీట్​ పీజీ 2025 ఎడిట్​ విండో అందుబాటులో ఉంటుంది. జూన్​ 22న మూతపడుతుంది. జులై 21న ఎగ్జామ సిటీ వివరాలను ప్రకటిస్తారు. జులై 31న అడ్మిట్​ కార్డులు విడుదల అవుతాయి.

నీట్​ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్​ 3న ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఫలితాలను సెప్టెంబర్​ 3న ప్రకటిస్తారు.

(4 / 5)

నీట్​ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్​ 3న ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఫలితాలను సెప్టెంబర్​ 3న ప్రకటిస్తారు.

ఎంబీబీఎస్​ అనంతరం వైద్య విద్యార్థులు రాసే పరీక్ష ఈ నీట్​ పీజీ. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇదొకటి. ప్రతియేటా లక్షల్లో విద్యార్థులు నీట్​ రాస్తుంటారు.

(5 / 5)

ఎంబీబీఎస్​ అనంతరం వైద్య విద్యార్థులు రాసే పరీక్ష ఈ నీట్​ పీజీ. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇదొకటి. ప్రతియేటా లక్షల్లో విద్యార్థులు నీట్​ రాస్తుంటారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు