Nara Brahmani: ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం…మంగళగిరిని ఐటీ హబ్ చేస్తామన్న నారా బ్రాహ్మణి..
- Nara Brahmani: కష్టపడే తత్వం, పట్టదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరిలోని ఐటీ కంపెనీలో పర్యటించిన బ్రహ్మణి భవిష్యత్తులో మంగళగిరిలో మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయన్నారు.
- Nara Brahmani: కష్టపడే తత్వం, పట్టదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరిలోని ఐటీ కంపెనీలో పర్యటించిన బ్రహ్మణి భవిష్యత్తులో మంగళగిరిలో మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయన్నారు.
(3 / 9)
మంగళగిరి ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి. సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని, ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమన్నారు.
(4 / 9)
ఐదేళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయని, కొత్త కంపెనీల జాడ లేదు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయని బ్రాహ్మణి చెప్పారు.యువతను కోరేది ఒక్కటేనని జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలని, అభివృద్ధికి పట్టం కట్టండి. మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాట వినబడదన్నారు.
(6 / 9)
2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు పై కేర్ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీయువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు
(8 / 9)
హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమని బ్రాహ్మణి చెప్పారు
ఇతర గ్యాలరీలు