(1 / 8)
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు లక్షకుపైగా ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. వీటికి సంబంధించి వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
(HT Telugu)(2 / 8)
రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా… ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగింది. వీటిలో 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.
(3 / 8)
ఇండ్ల మంజూరు,గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి,భూపాలపల్లి,హనుమకొండ,వికారాబాద్, సిద్దిపేట,నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు కాస్త వెనకబడి ఉంది. ఈ జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టి… గ్రౌండింగ్ పనులపై దృష్టి పెట్టే దిశగా అధికారులు ఫోకస్ చేస్తున్నారు.
(4 / 8)
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ఎంసి) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాలలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
(5 / 8)
వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగైన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది.
(6 / 8)
మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
(7 / 8)
ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నాం. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నారు.
(8 / 8)
బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1లక్ష25 వేలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1లక్ష75 వేలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు