నెలవారీ పింఛను పెంపు- వారందరికీ గుడ్​ న్యూస్​!-monthly pension hiked to rupees 1100 by nitish kumar ahead of bihar elections ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నెలవారీ పింఛను పెంపు- వారందరికీ గుడ్​ న్యూస్​!

నెలవారీ పింఛను పెంపు- వారందరికీ గుడ్​ న్యూస్​!

Published Jun 21, 2025 12:52 PM IST Sharath Chitturi
Published Jun 21, 2025 12:52 PM IST

బిహార్​ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని పింఛనుదారులకు సీఎం నితీశ్​ కుమార్​ గుడ్​ న్యూస్​ ఇచ్చారు. పింఛనను పెంచుతున్నట్టు తెలిపారు.

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే నెలవారీ పింఛనను రూ. 400 నుంచి రూ. 1,110కి పెంచుతున్నట్టు నితీశ్​ కుమార్​ ప్రకటించారు.

(1 / 5)

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే నెలవారీ పింఛనను రూ. 400 నుంచి రూ. 1,110కి పెంచుతున్నట్టు నితీశ్​ కుమార్​ ప్రకటించారు.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర సామాజిక భద్రత పింఛను పథకం కింద 1,09,69,255 మంది లబ్ధిపొందనున్నట్టు నితీశ్​ కుమార్​ వివరించారు.

(2 / 5)

ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర సామాజిక భద్రత పింఛను పథకం కింద 1,09,69,255 మంది లబ్ధిపొందనున్నట్టు నితీశ్​ కుమార్​ వివరించారు.

"సామాజిక భద్రత పింఛను పథకం అమలయ్యే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇక నుంచి రూ.400కి బదులు రూ. 1,100 పెన్షన్​ లభిస్తుందని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. జులై నుంచి లబ్ధిదారులకు ఇది అమల్లోకి వస్తుంది. ప్రతి నెల 10వ తేదీన లబ్ధిదారులందరి ఖాతాలో ఈ డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటాను. 1 కోటి 9 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు ఇది సాయం చేస్తుంది," అని నితీశ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.

(3 / 5)

"సామాజిక భద్రత పింఛను పథకం అమలయ్యే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇక నుంచి రూ.400కి బదులు రూ. 1,100 పెన్షన్​ లభిస్తుందని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. జులై నుంచి లబ్ధిదారులకు ఇది అమల్లోకి వస్తుంది. ప్రతి నెల 10వ తేదీన లబ్ధిదారులందరి ఖాతాలో ఈ డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటాను. 1 కోటి 9 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు ఇది సాయం చేస్తుంది," అని నితీశ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.

ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిపై​ గెలిచేందుకు జేడీయూ- తన మిత్రపక్షం ఎన్డీఏ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

(4 / 5)

ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిపై​ గెలిచేందుకు జేడీయూ- తన మిత్రపక్షం ఎన్డీఏ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

(HT_PRINT)

రాష్ట్రంలోని జిల్లా పరిషద్​ అధ్యక్షుల నెలవారీ అలొవెన్స్​ని ఇటీవలే రూ. 20వేల నుంచి రూ.30వేలకు చేశారు నితీస్​ కుమార్​. జెడ్​పీ ఉపాధ్యక్షుడి నెలవారీ అలొవెన్స్​ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు.

(5 / 5)

రాష్ట్రంలోని జిల్లా పరిషద్​ అధ్యక్షుల నెలవారీ అలొవెన్స్​ని ఇటీవలే రూ. 20వేల నుంచి రూ.30వేలకు చేశారు నితీస్​ కుమార్​. జెడ్​పీ ఉపాధ్యక్షుడి నెలవారీ అలొవెన్స్​ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు.

(Pappi Sharma )

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు