(1 / 6)
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిఎస్సీకి దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో 45 శాతం, పీజీలో 50 శాతం ఉండాలనే నిబంధన విధించారు. 2024లో ఈ నిబంధన లేదని చెబుతున్నారు.
(2 / 6)
డిఎస్సీ దరఖాస్తు ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన అమలు చేస్తున్నారు. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన కారణంగా లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీకి అర్హత లేకుండా పోతారు. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు కనీస అర్హత మార్కులను నిర్ణయించారు.
(3 / 6)
2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో అర్హత మార్కుల నిబంధనను లేకున్నా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం అర్హత మార్కులను నిర్ణయించినట్టు ప్రభుత్వం చెబుతోంది.
(4 / 6)
డిఎస్సీ 2025లో కీలక మార్పులు జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50శాతం, పీజీలో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. ఎన్సీటీఈ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
(5 / 6)
ప్రభుత్వ నిబంధనతో దాదాపు లక్షల సంఖ్యలో అభ్యర్థులకు దరఖాస్తు చేసేందుకు వీల్లేగుండా పోయింది. అభ్యర్థి విద్యార్హత, సాధించిన మార్కులను, అవసరమైన పత్రాలను ముందే అప్లోడ్ చేయాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు.
ఇతర గ్యాలరీలు