ఏపీ డిఎస్సీ 2025కు దరఖాస్తు చేయాలంటే ఇంటర్‌, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు తప్పనిసరి…-minimum qualifying marks in inter and degree are mandatory to apply for ap dsc 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ డిఎస్సీ 2025కు దరఖాస్తు చేయాలంటే ఇంటర్‌, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు తప్పనిసరి…

ఏపీ డిఎస్సీ 2025కు దరఖాస్తు చేయాలంటే ఇంటర్‌, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు తప్పనిసరి…

Published Apr 22, 2025 02:09 PM IST Sarath Chandra.B
Published Apr 22, 2025 02:09 PM IST

  • ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థాలకు అర్హత మార్కులు అడ్డంకిగా మారాయి. సెకండరీ గ్రేడ్ టీచర్‌ పోస్టులకు కనీసం విద్యార్హత ఇంటర్‌, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో 50శాతం మార్కులను తప్పనిసరి చేశారు. ఈ నిబంధనతో పలువురు పరీక్షలకు అర్హత లేకుండా పోయారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిఎస్సీకి దరఖాస్తు చేయాలంటే  డిగ్రీలో 45 శాతం, పీజీలో 50 శాతం ఉండాలనే నిబంధన విధించారు. 2024లో ఈ నిబంధన లేదని చెబుతున్నారు.

(1 / 6)

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిఎస్సీకి దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో 45 శాతం, పీజీలో 50 శాతం ఉండాలనే నిబంధన విధించారు. 2024లో ఈ నిబంధన లేదని చెబుతున్నారు.

డిఎస్సీ దరఖాస్తు ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన అమలు చేస్తున్నారు. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన కారణంగా  లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీకి అర్హత లేకుండా పోతారు. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు  కనీస అర్హత  మార్కులను నిర్ణయించారు.

(2 / 6)

డిఎస్సీ దరఖాస్తు ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన అమలు చేస్తున్నారు. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన కారణంగా లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీకి అర్హత లేకుండా పోతారు. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు కనీస అర్హత మార్కులను నిర్ణయించారు.

2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన  డీఎస్సీ నోటిఫికేషన్‌లో అర్హత మార్కుల నిబంధనను లేకున్నా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌ నిబంధనల ప్రకారం అర్హత మార్కులను నిర్ణయించినట్టు ప్రభుత్వం చెబుతోంది.

(3 / 6)

2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో అర్హత మార్కుల నిబంధనను లేకున్నా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌ నిబంధనల ప్రకారం అర్హత మార్కులను నిర్ణయించినట్టు ప్రభుత్వం చెబుతోంది.

డిఎస్సీ 2025లో  కీలక మార్పులు జనరల్‌ అభ్యర్థులకు  డిగ్రీలో 50శాతం, పీజీలో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు.  ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

(4 / 6)

డిఎస్సీ 2025లో కీలక మార్పులు జనరల్‌ అభ్యర్థులకు డిగ్రీలో 50శాతం, పీజీలో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వ నిబంధనతో  దాదాపు  లక్షల సంఖ్యలో అభ్యర్థులకు దరఖాస్తు చేసేందుకు వీల్లేగుండా పోయింది.  అభ్యర్థి విద్యార్హత, సాధించిన మార్కులను, అవసరమైన పత్రాలను ముందే అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు.

(5 / 6)

ప్రభుత్వ నిబంధనతో దాదాపు లక్షల సంఖ్యలో అభ్యర్థులకు దరఖాస్తు చేసేందుకు వీల్లేగుండా పోయింది. అభ్యర్థి విద్యార్హత, సాధించిన మార్కులను, అవసరమైన పత్రాలను ముందే అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు.

తాజా నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్‌లో లో 50 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. పీజీ టీచర్‌ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది

(6 / 6)

తాజా నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్‌లో లో 50 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. పీజీ టీచర్‌ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు