నిప్పుల కుంపటిలా ఉత్తర తెలంగాణ.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ-meteorological department has issued a red alert for 7 districts of north telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నిప్పుల కుంపటిలా ఉత్తర తెలంగాణ.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

నిప్పుల కుంపటిలా ఉత్తర తెలంగాణ.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Published Apr 25, 2025 12:32 PM IST Basani Shiva Kumar
Published Apr 25, 2025 12:32 PM IST

తెలంగాణలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఇవాళ అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలలో రాత్రి పూట వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేసింది.

(1 / 6)

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఇవాళ అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలలో రాత్రి పూట వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేసింది.

(unsplash)

తెలంగాణలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

(2 / 6)

తెలంగాణలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

(unsplash)

మరో రెండు రోజులు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న  గరిష్టంగా ఆదిలాబాద్‌లో 44.6, కనిష్టంగా హైదరాబాద్‌లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 24న  ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హనుమకొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

(3 / 6)

మరో రెండు రోజులు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న గరిష్టంగా ఆదిలాబాద్‌లో 44.6, కనిష్టంగా హైదరాబాద్‌లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 24న ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హనుమకొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

(unsplash)

ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఈ సమయంలో శరీరం వేడికి గురై అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేస్తున్నారు.

(4 / 6)

ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఈ సమయంలో శరీరం వేడికి గురై అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేస్తున్నారు.

(unsplash)

డీహైడ్రేషన్ నివారించడానికి రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు మరింత ఎక్కువగా నీరు తాగాలి. నీటికి బదులు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి కూడా తీసుకోవచ్చు. వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలు, మసాలాలు తగ్గించాలి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

(5 / 6)

డీహైడ్రేషన్ నివారించడానికి రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు మరింత ఎక్కువగా నీరు తాగాలి. నీటికి బదులు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి కూడా తీసుకోవచ్చు. వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలు, మసాలాలు తగ్గించాలి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

(unsplash)

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వడగండ్ల  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని ఐఎండీ అంచనా వేసింది.

(6 / 6)

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని ఐఎండీ అంచనా వేసింది.

(unsplash)

ఇతర గ్యాలరీలు