(1 / 5)
మధ్యప్రదేశ్కి చెందిన రాజ రఘువంశి, సోనమ్లకు 2025 మే 11న వివాహం జరిగింది. అనంతరం వారు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. కాగా మే 23న దంపతులు అదృశ్యమయ్యారు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టినా చాలా రోజుల పాటు వారి ఆచూకీ లభించలేదు.
(ANI)(2 / 5)
కాగా చిరాపుంజికి సమీపంలోని ఒక లోయలో జూన్ 2న రాజ రఘువంశి మృతదేహాన్ని కుళ్లిపోయిన దశలో పోలీసులు గర్తించారు. అతడిని దారుణంగా హత్య చేశారని వారికి అర్థమైంది. కానీ సోనమ్ ఎక్కడా కనిపించలేదు. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు తొలుత భావించారు.
(HT_PRINT)(3 / 5)
పోలీసుల దర్యాప్తులో వారికి ఒక కొడవలి కనిపించింది. ఆ కొడవలితోనే రాజ రఘువంశి హత్య జరిగిందని వారికి తెలిసింది. అయితే, ఆ రకమైన కొడవలి మేఘాలయలో పెద్దగా వాడరు! అప్పుడు పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. బయటి వ్యక్తులు ఈ పని చేసుంటారని వారు భావించారు.
(ANI - X)(4 / 5)
ఆ తర్వాత దంపతుల కాల్ రికార్డులను పోలీసులు సేకరించారు. మర్డర్కి కొన్ని రోజుల ముందు వరకు సోనమ్ ఒక వ్యక్తితో మాటిమాటికి కాల్లో మాట్లాడేది. అతని లొకేషన్.. ఆ దంపతుల లొకేషన్కి దగ్గరిలోనే ఉందని పోలీసులు తెలుసుకున్నారు.
(5 / 5)
పోలీసులకు సోనమ్పై అనుమానాలు పెరిగాయి. ఇంతలో ఒక టూరిస్ట్ గైడు రాజా రఘువంశి, సోనమ్లు అదృశ్యమవ్వడానికి ఒక రోజు ముందు, వారిని మరో నలుగురితో కలిసి ఉండటాన్ని చూసినట్టు పోలీసులకు చెప్పాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారే కిల్లర్లని తర్వాత తెలిసింది. సోనమ్ చెప్పడంతోనే రఘువంశిని చంపినట్టు వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలా ఈ పూర్తి వ్యవహారం బయటపడింది. సోనమ్కు రాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే రాజ రఘువంశిని చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ పూర్తి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
(HT_PRINT)ఇతర గ్యాలరీలు