తెలంగాణలోని రేషన్ షాపుల వద్ద జనం బారులు...! కారణాలెంటో తెలుసా-massive crowd at telangana ration shops reasons check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణలోని రేషన్ షాపుల వద్ద జనం బారులు...! కారణాలెంటో తెలుసా

తెలంగాణలోని రేషన్ షాపుల వద్ద జనం బారులు...! కారణాలెంటో తెలుసా

Published Jun 07, 2025 07:01 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 07, 2025 07:01 PM IST

తెలంగాణలోని రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. సర్వర్‌ డౌన్‌ సమస్యలతో వేలిముద్రల నమోదులో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో రేషన్ పంపిణీ ఆలస్యమవుతోంది.

తెలంగాణలోని రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తున్నారు.

(1 / 6)

తెలంగాణలోని రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే… పట్టణ ప్రాంతాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. సర్వర్‌ డౌన్‌ కావడంతో వేలిముద్రల నమోదులో జాప్యంతో పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు.

(2 / 6)

గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే… పట్టణ ప్రాంతాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. సర్వర్‌ డౌన్‌ కావడంతో వేలిముద్రల నమోదులో జాప్యంతో పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు.

(ఫైల్ ఫొటో)

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7గంటల నుంచే షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు.

(3 / 6)

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7గంటల నుంచే షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు.

(ఫైల్ ఫొటో)

ఉదయం, సాయంత్రం సమయాల్లో బియ్యం పంపిణీ చేస్తున్న రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇవ్వటంతో పాటు పైగా సన్నబియ్యం కావడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు.

(4 / 6)

ఉదయం, సాయంత్రం సమయాల్లో బియ్యం పంపిణీ చేస్తున్న రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇవ్వటంతో పాటు పైగా సన్నబియ్యం కావడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు.

(ఫైల్ ఫొటో)

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో జూన్, జులై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

(5 / 6)

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో జూన్, జులై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం  సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. కాబట్టి మూడు నెలలకు సరిపడే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ప్రతి మనిషిపై 18 కిలలో రేషన్ అందిస్తున్నారు.

(6 / 6)

తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. కాబట్టి మూడు నెలలకు సరిపడే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ప్రతి మనిషిపై 18 కిలలో రేషన్ అందిస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు