Vijayawada Police: పోయిన ఫోన్లు పట్టేశారు.. విజయవాడలో భారీగా ఫోన్లు స్వాధీనం, రికార్డు స్థాయిలో రికవరీ-lost phones recovered huge number of phones seized in vijayawada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vijayawada Police: పోయిన ఫోన్లు పట్టేశారు.. విజయవాడలో భారీగా ఫోన్లు స్వాధీనం, రికార్డు స్థాయిలో రికవరీ

Vijayawada Police: పోయిన ఫోన్లు పట్టేశారు.. విజయవాడలో భారీగా ఫోన్లు స్వాధీనం, రికార్డు స్థాయిలో రికవరీ

Published Feb 23, 2025 01:24 PM IST Sarath Chandra.B
Published Feb 23, 2025 01:24 PM IST

  • Vijayawada Police: విజయవాడలో భారీ సంఖ్యలో చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.60లక్షల విలువైన 372 ఫోన్లను స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న వారికి అందచేశారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్ సాయంతో చోరీకి గురైన ఫోన్లను రికవరీ  చేసి అసలు యజమానులకు అప్పగించారు. 

విజయవాడలో ఫోన్‌ పొగొట్టుకున్న మహిళకు రికవరీ చేసిన ఫోన్‌ అందిస్తున్న డీపీసీ గౌతమి

(1 / 10)

విజయవాడలో ఫోన్‌ పొగొట్టుకున్న మహిళకు రికవరీ చేసిన ఫోన్‌ అందిస్తున్న డీపీసీ గౌతమి

ఫోన్‌ రికవరీ కావడంతో తీసుకోవడానికి వచ్చిన మహిళకు సాయం చేస్తున్న కానిస్టేబుల్

(2 / 10)

ఫోన్‌ రికవరీ కావడంతో తీసుకోవడానికి వచ్చిన మహిళకు సాయం చేస్తున్న కానిస్టేబుల్

విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో  పోగొట్టుకున్న/ దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను CEIR  పోర్టల్ ద్వారా రికవరి చేసి బాధితులకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు  అందించారు.  

(3 / 10)

విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో  పోగొట్టుకున్న/ దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను CEIR  పోర్టల్ ద్వారా రికవరి చేసి బాధితులకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు  అందించారు. 
 

సుమారు 60 లక్షల విలువైన 372 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు  నగర పోలీస్ కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు అందించారు.  

(4 / 10)

సుమారు 60 లక్షల విలువైన 372 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు  నగర పోలీస్ కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు అందించారు. 
 

విజయవాడ పోలీసులు రికార్డు స్థాయిలో చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఖరీదైన మొబైల్స్‌ చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ రిజిస్టర్‌ సాయంతో చోరీకి గురైన ఫోన్ల ఐఎంఇఐ నంబర్లను బ్లాక్‌ చేసి ఎవరి వద్ద ఉన్నాయో గుర్తిస్తున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్‌ రికవరీ కావడంతో సీపీ రాజశేఖర‌ బాబుకు కృతజ్ఞతలు చెబుతున్న వృద్ధుడు. 

(5 / 10)

విజయవాడ పోలీసులు రికార్డు స్థాయిలో చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఖరీదైన మొబైల్స్‌ చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ రిజిస్టర్‌ సాయంతో చోరీకి గురైన ఫోన్ల ఐఎంఇఐ నంబర్లను బ్లాక్‌ చేసి ఎవరి వద్ద ఉన్నాయో గుర్తిస్తున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్‌ రికవరీ కావడంతో సీపీ రాజశేఖర‌ బాబుకు కృతజ్ఞతలు చెబుతున్న వృద్ధుడు. 

మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో భాగంగా రికవరి చేసిన 372 మొబైల్ ఫోన్లను ఆదివారం ఉదయం  కమాండ్ కంట్రోల్ ‌లో  పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఫిర్యాదు దారులకు అందజేశారు. నాల్గవ విడత రికవరీ ఫోన్ల విలువ సుమారుగా రూ. 60 లక్షలు ఉండవచ్చని తెలిపారు. 

(6 / 10)

మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో భాగంగా రికవరి చేసిన 372 మొబైల్ ఫోన్లను ఆదివారం ఉదయం  కమాండ్ కంట్రోల్ ‌లో  పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఫిర్యాదు దారులకు అందజేశారు. నాల్గవ విడత రికవరీ ఫోన్ల విలువ సుమారుగా రూ. 60 లక్షలు ఉండవచ్చని తెలిపారు. 

ప్రజల  పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా రికవరీ చేస్తున్నట్టు సీపీ వివరించారు. ఫిర్యాదు దారులు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు IMEI నెంబర్లు, బిల్లు మరియు అడ్రస్ ప్రూఫ్ లను CEIR పోర్టల్ లో నమోదు చేస్తారు. 

(7 / 10)

ప్రజల  పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా రికవరీ చేస్తున్నట్టు సీపీ వివరించారు. ఫిర్యాదు దారులు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు IMEI నెంబర్లు, బిల్లు మరియు అడ్రస్ ప్రూఫ్ లను CEIR పోర్టల్ లో నమోదు చేస్తారు. 

సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశాki, గతంలో కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధినం చేసుకున్నారు.  ఫోన్ పోయిన వెంటనే పోలీసు లకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుందని సీపీ వివరించారు. 

(8 / 10)

సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశాki, గతంలో కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధినం చేసుకున్నారు.  ఫోన్ పోయిన వెంటనే పోలీసు లకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుందని సీపీ వివరించారు. 

ఏ ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి గురైన ఫోన్లను  గుర్తించినట్టు తెలిపారు. ఫోన్ లోనే ప్రతి మనిషి జీవితం ఉంటుందని,  బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు‌ కార్డులు ఫోన్ తోనే ముడిపడి ఉన్నాయని,  మరి కొన్ని ఫోన్లను గుర్తించాల్సి ఉందని  త్వరలో వాటిని కూడా స్వాదీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. 

(9 / 10)

ఏ ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి గురైన ఫోన్లను  గుర్తించినట్టు తెలిపారు. 
ఫోన్ లోనే ప్రతి మనిషి జీవితం ఉంటుందని,  బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు‌ కార్డులు ఫోన్ తోనే ముడిపడి ఉన్నాయని,  మరి కొన్ని ఫోన్లను గుర్తించాల్సి ఉందని  త్వరలో వాటిని కూడా స్వాదీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. 

CEIR లో నమోదు చేసిన తర్వాత, ఫిర్యాదుదారులకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ నెంబర్ వస్తుంది. TSP (Telecom Service Provider రిజిస్టర్‌లలో IMEI నెంబర్లను బ్లాక్ చేసి, ప్రస్తుతం ఆ ఫోన్ ను ఎవరు వాడుతున్నారో వారి వివరాలను పోలీసులకు అందిస్తారు. ఇలా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి IMEI నెంబర్‌ను అన్‌బ్లాక్ చేసి ఫిర్యాదు దారులకు పోలీసులు అందజేస్తారు. 

(10 / 10)

CEIR లో నమోదు చేసిన తర్వాత, ఫిర్యాదుదారులకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ నెంబర్ వస్తుంది. TSP (Telecom Service Provider రిజిస్టర్‌లలో IMEI నెంబర్లను బ్లాక్ చేసి, ప్రస్తుతం ఆ ఫోన్ ను ఎవరు వాడుతున్నారో వారి వివరాలను పోలీసులకు అందిస్తారు. ఇలా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి IMEI నెంబర్‌ను అన్‌బ్లాక్ చేసి ఫిర్యాదు దారులకు పోలీసులు అందజేస్తారు.

 

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు