తెగ తాగేస్తున్నారు. .ఏపీలో భారీగా పెరిగిన లిక్కర్ రెవిన్యూ, రూ.3వేల కోట్ల అదనపు ఆదాయం..-liquor revenue has increased significantly in ap an additional income of rs 3 thousand crores ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెగ తాగేస్తున్నారు. .ఏపీలో భారీగా పెరిగిన లిక్కర్ రెవిన్యూ, రూ.3వేల కోట్ల అదనపు ఆదాయం..

తెగ తాగేస్తున్నారు. .ఏపీలో భారీగా పెరిగిన లిక్కర్ రెవిన్యూ, రూ.3వేల కోట్ల అదనపు ఆదాయం..

Published Apr 18, 2025 12:11 PM IST Sarath Chandra.B
Published Apr 18, 2025 12:11 PM IST

  • ఏపీలో మద్యం విక్రయాలతో కళ్లు చెదిరే ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. వైసీపీ హయంలో పెంచిన ధరల్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. 2024-25లో రూ.28వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ3వేల కోట్ల ఎక్కువ సమకూరింది.

ఏపీలో మద్యం విక్రయాలతో 2024-25 సంవత్సరానికి రూ.28,842 కోట్ల ఆదాయం లభించింది.  2023-24లో రూ.25,082కోట్ల ఆదాయం లభిస్తే అదనంగా రూ.3,760 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది.

(1 / 7)

ఏపీలో మద్యం విక్రయాలతో 2024-25 సంవత్సరానికి రూ.28,842 కోట్ల ఆదాయం లభించింది. 2023-24లో రూ.25,082కోట్ల ఆదాయం లభిస్తే అదనంగా రూ.3,760 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది.

(istockphoto)

2019-24 మధ్య కాలంలో ఏపీలో ప్రభుత్వమే స్వయంగా మద్యం విక్రయాలు జరిపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది.

(2 / 7)

2019-24 మధ్య కాలంలో ఏపీలో ప్రభుత్వమే స్వయంగా మద్యం విక్రయాలు జరిపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది.

(Image source: https://istockphoto.com)

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది.  ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బ్రాండ్ల మద్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది.

(3 / 7)

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బ్రాండ్ల మద్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది.

(istockphoto)

ఏపీలో 2019-24 మధ్య కాలంలో మద్యం అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏటా దాదాపు  రూ.3వేల కోట్ల రుపాయల ముడుపులు దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.  ఈ వ్యవహారాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది.

(4 / 7)

ఏపీలో 2019-24 మధ్య కాలంలో మద్యం అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏటా దాదాపు రూ.3వేల కోట్ల రుపాయల ముడుపులు దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది.

(Image source: https://istockphoto.com)

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ బ్రాండ్ల మద్యం లభ్యత పెరిగింది. మద్యం ధరల్ని తగ్గిస్తామనే హామీని అమలు చేసే క్రమంలో కొత్తగా రూ.99 మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.  2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం ఆదాయం మరింత పెరుగనుంది.

(5 / 7)

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ బ్రాండ్ల మద్యం లభ్యత పెరిగింది. మద్యం ధరల్ని తగ్గిస్తామనే హామీని అమలు చేసే క్రమంలో కొత్తగా రూ.99 మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం ఆదాయం మరింత పెరుగనుంది.

2024-25లో మద్యం అమ్మకాలు 9.1శాతం పెరుగుదల నమోదైంది.  2023-24లో  4.55కోట్ల కేసుల మద్యం విక్రయిస్తే, 2024-25లొో 4.97 కోట్ల కేసుల మద్యాన్ని విక్రయించారు.

(6 / 7)

2024-25లో మద్యం అమ్మకాలు 9.1శాతం పెరుగుదల నమోదైంది. 2023-24లో 4.55కోట్ల కేసుల మద్యం విక్రయిస్తే, 2024-25లొో 4.97 కోట్ల కేసుల మద్యాన్ని విక్రయించారు.

(Pixabay)

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది లిక్కర్‌ అమ్మకాల్లో 7.38శాతం, బీర్ల అమ్మకాల్లో 14.13శాతం వృద్ధి నమోదైంది. రూ. 99 మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.  గత ఏడాది మొత్తం అమ్మకాల్లో  వీటి వాటా 30శాతం ఉంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో  రూ.99మద్యాన్ని  నాటుసారా ప్రభావిత ప్రాంతాలు,  గ్రామీణ ప్రాంతాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

(7 / 7)

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది లిక్కర్‌ అమ్మకాల్లో 7.38శాతం, బీర్ల అమ్మకాల్లో 14.13శాతం వృద్ధి నమోదైంది. రూ. 99 మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 30శాతం ఉంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో రూ.99మద్యాన్ని నాటుసారా ప్రభావిత ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు