AP Rain Alert : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్... ద్రోణి ప్రభావంతో వర్ష సూచన...!-light to moderate rains likely in coastal areas of andhrapradesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Rain Alert : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్... ద్రోణి ప్రభావంతో వర్ష సూచన...!

AP Rain Alert : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్... ద్రోణి ప్రభావంతో వర్ష సూచన...!

Published Mar 28, 2025 03:29 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 28, 2025 03:29 PM IST

  • Andhrapradesh Weather Updates : ఓవైపు ఏపీలో ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో… ఉత్తర, దక్షిణ కోస్తాలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. సీమతో పాటు మరికొన్నిచోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అకాల వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారంలో కాస్త ఎండ తీవ్రత తగ్గినప్పటికీ… మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి.

(1 / 7)

అకాల వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారంలో కాస్త ఎండ తీవ్రత తగ్గినప్పటికీ… మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి.

ఏపీలో రోజురోజుకూ సూర్యుడి ప్రతాపం పెరుగుతుండగా… కొన్నిచోట్ల వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అమరావతి వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ఇచ్చింది.

(2 / 7)

ఏపీలో రోజురోజుకూ సూర్యుడి ప్రతాపం పెరుగుతుండగా… కొన్నిచోట్ల వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అమరావతి వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ఇచ్చింది.

(Photo Source @APSDMA Twitter)

అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి... సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా... ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరేళ వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా విస్తరించి ఉన్న మరో ద్రోణి ఇవాళ బలహీనపడిందని వివరించింది.

(3 / 7)

అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి... సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా... ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరేళ వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా విస్తరించి ఉన్న మరో ద్రోణి ఇవాళ బలహీనపడిందని వివరించింది.

(@APSDMA)

ద్రోణి ప్రభావంతో… ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఎల్లుండి(మార్చి 30) తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది.

(4 / 7)

ద్రోణి ప్రభావంతో… ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఎల్లుండి(మార్చి 30) తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది.

(image source unsplash.com)

అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

(5 / 7)

అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

ఇక రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు, ఎల్లుండి... పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

(6 / 7)

ఇక రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు, ఎల్లుండి... పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

(AFP)

ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో… హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

(7 / 7)

ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో… హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

(Photo Source From unsplash.com)

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు