ద్రోణి ప్రభావం - ఏపీకి వర్ష సూచన...! ఐఎండీ తాజా అప్డేట్స్ ఇవే-light to moderate rains likely in andhrapradesh imd weather updates details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ద్రోణి ప్రభావం - ఏపీకి వర్ష సూచన...! ఐఎండీ తాజా అప్డేట్స్ ఇవే

ద్రోణి ప్రభావం - ఏపీకి వర్ష సూచన...! ఐఎండీ తాజా అప్డేట్స్ ఇవే

Published Apr 25, 2025 03:16 PM IST Maheshwaram Mahendra Chary
Published Apr 25, 2025 03:16 PM IST

ఏపీ వాసులకు ఐఎండీ కూల్ న్యూస్ చెప్పింది. ద్రోణ ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక్క మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉందని తెలిపింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు వడగాల్పుల దాటికి జనం బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు.

(1 / 7)

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు వడగాల్పుల దాటికి జనం బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు.

ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

(2 / 7)

ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

(istock.com)

 అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ (ఏప్రిల్ 25, 2025) వివరాల ప్రకారం... మరాఠ్వాడ ఉత్తర భాగం నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఉత్తర - దక్షిణ ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.

(3 / 7)

అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ (ఏప్రిల్ 25, 2025) వివరాల ప్రకారం... మరాఠ్వాడ ఉత్తర భాగం నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఉత్తర - దక్షిణ ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.

(istock.com)

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండగా... కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చు. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

(4 / 7)

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండగా... కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చు. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

(istock.com)

దక్షిణ కోస్తాలో చూస్తే ఇవాళ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటనుంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో  కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు.

(5 / 7)

దక్షిణ కోస్తాలో చూస్తే ఇవాళ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటనుంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు.

(istock.com)

రాయలసీమ జిల్లాల్లో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో  కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు.

(6 / 7)

రాయలసీమ జిల్లాల్లో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు.

(istock.com)

రాగల 3 రోజుల్లో కోస్తా, యానాం, రాయలసీమలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 3 రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు... సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 - 3 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత గణనీయమైన మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది.

(7 / 7)

రాగల 3 రోజుల్లో కోస్తా, యానాం, రాయలసీమలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 3 రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు... సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 - 3 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత గణనీయమైన మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది.

(Image Source Pixabay )

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు