(1 / 7)
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు వడగాల్పుల దాటికి జనం బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు.
(2 / 7)
ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
(istock.com)(3 / 7)
అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ (ఏప్రిల్ 25, 2025) వివరాల ప్రకారం... మరాఠ్వాడ ఉత్తర భాగం నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఉత్తర - దక్షిణ ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.
(4 / 7)
ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండగా... కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చు. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
(5 / 7)
దక్షిణ కోస్తాలో చూస్తే ఇవాళ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటనుంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు.
(6 / 7)
రాయలసీమ జిల్లాల్లో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంటకు 30 - 40 కి.మీ వేగంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు.
ఇతర గ్యాలరీలు