AP TG Weather Updates : ఎండలు మండుతున్న వేళ ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ నుంచి తెలంగాణలో వర్షాలు..!-light rains are likely to occur in telangana from february 21 imd weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఎండలు మండుతున్న వేళ ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ నుంచి తెలంగాణలో వర్షాలు..!

AP TG Weather Updates : ఎండలు మండుతున్న వేళ ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ నుంచి తెలంగాణలో వర్షాలు..!

Published Feb 18, 2025 05:45 AM IST Maheshwaram Mahendra Chary
Published Feb 18, 2025 05:45 AM IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం దాటితే చాలు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో ఫిబ్రవరి 21 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా అప్డేట్స్ ఇవే…
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మాసం దాటకముందే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి.

(1 / 8)

ఏపీ, తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మాసం దాటకముందే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి.

(image source unsplash.com)

ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. అప్పుడే వేసవి వచ్చేసిందా..? అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. 

(2 / 8)

ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. అప్పుడే వేసవి వచ్చేసిందా..? అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. 

(image source unsplash.com)

చాలాచోట్ల ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణతో పోల్చితే.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. 

(3 / 8)

చాలాచోట్ల ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణతో పోల్చితే.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. 

(image source unsplash.com)

ఫిబ్రవరి మాసంలోనే ఎండలతో సతమవుతున్న తెలంగాణ వాసలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. 

(4 / 8)

ఫిబ్రవరి మాసంలోనే ఎండలతో సతమవుతున్న తెలంగాణ వాసలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. 

(image source unsplash.com)

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. 

(5 / 8)

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. 

(image source unsplash.com)

ఫిబ్రవరి 23వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు మాత్రం పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.

(6 / 8)

ఫిబ్రవరి 23వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు మాత్రం పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.

(image source unsplash.com)

తెలంగాణలో ఇవాళ్టి వెదర్ చూస్తే… పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఏపీలో చూస్తే గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 

(7 / 8)

తెలంగాణలో ఇవాళ్టి వెదర్ చూస్తే… పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఏపీలో చూస్తే గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 

(image source unsplash.com)

దక్షిణ కోస్తా. ఉత్తర కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 

(8 / 8)

దక్షిణ కోస్తా. ఉత్తర కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 

(image source unsplash.com)

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు