AP TG Weather : ద్రోణి ప్రభావం - ఉత్తర కోస్తా, సీమకు వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు-light rain forecast for few areas of the north coast and rayalaseema imd weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather : ద్రోణి ప్రభావం - ఉత్తర కోస్తా, సీమకు వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు

AP TG Weather : ద్రోణి ప్రభావం - ఉత్తర కోస్తా, సీమకు వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు

Published Mar 27, 2025 05:33 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 27, 2025 05:33 PM IST

  • AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎండల తీవ్రత షురూ అయింది. అకాల వర్షాలతో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ… మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలుచోట్ల వడగాల్పులు వీస్తున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తా, సీమలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణ ఛత్తీస్ ఘట్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర - దక్షిణ ద్రోమి ఇవాళ ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరళ వరకు విస్తరించింది ఉంది. అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

(1 / 8)

దక్షిణ ఛత్తీస్ ఘట్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర - దక్షిణ ద్రోమి ఇవాళ ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరళ వరకు విస్తరించింది ఉంది. అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

(image source unsplash.com)

ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది.   రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేసింది.

(2 / 8)

ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేసింది.

(image source unsplash.com)

ఇక దక్షిణ కోస్తాలో చూస్తే...పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలసెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది.

(3 / 8)

ఇక దక్షిణ కోస్తాలో చూస్తే...పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలసెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది.

ఇక సీమలో చూస్తే ఇవాళ తేలికపాటి వర్షాలు ఉండగా... రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ధోరణి 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అమరావతావరణ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో వివరించింది.

(4 / 8)

ఇక సీమలో చూస్తే ఇవాళ తేలికపాటి వర్షాలు ఉండగా... రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ధోరణి 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అమరావతావరణ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో వివరించింది.

(Photo Source @APSDMA Twitter)

ఏపీలో రేపు అనగా శుక్రవారం (28-03-25) శ్రీకాకుళం జిల్లా -14, విజయనగరం-22, పార్వతీపురంమన్యం -12, అల్లూరి సీతరామరాజు-9, అనకాపల్లి-9, కాకినాడ-7, తూర్పుగోదావరి-8, ఏలూరు-5, ఎన్టీఆర్ -3 మండలాల్లో తీవ్రవడగాలులు (89) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు APSDMA డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

(5 / 8)

ఏపీలో రేపు అనగా శుక్రవారం (28-03-25) శ్రీకాకుళం జిల్లా -14, విజయనగరం-22, పార్వతీపురంమన్యం -12, అల్లూరి సీతరామరాజు-9, అనకాపల్లి-9, కాకినాడ-7, తూర్పుగోదావరి-8, ఏలూరు-5, ఎన్టీఆర్ -3 మండలాల్లో తీవ్రవడగాలులు (89) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు APSDMA డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఇవాళ ప్రకాశం జిల్లాలోని నందనమారెళ్ళలో 42.4°C, నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడులో 42.2°C, వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్టలో 42.1°C,కర్నూలులో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  అలాగే ఇవాళ 105 ప్రాంతాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(6 / 8)

ఇవాళ ప్రకాశం జిల్లాలోని నందనమారెళ్ళలో 42.4°C, నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడులో 42.2°C, వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్టలో 42.1°C,కర్నూలులో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఇవాళ 105 ప్రాంతాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(Photo Source @APSDMA Twitter)

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం,  విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ  కోనసీమ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎక్కువగా వ‌డ‌గాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాగు నీటి సరఫరా, ఉపాధి పనుల సమయంలో మార్పులు, హెల్త్ కిట్స్, అవగాహన కార్యక్రమాలకు సంబంధించి కీలక సూచనలు చేసింది.

(7 / 8)

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ కోనసీమ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎక్కువగా వ‌డ‌గాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాగు నీటి సరఫరా, ఉపాధి పనుల సమయంలో మార్పులు, హెల్త్ కిట్స్, అవగాహన కార్యక్రమాలకు సంబంధించి కీలక సూచనలు చేసింది.

(AFP)

ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు.

(8 / 8)

ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు