(1 / 7)
అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. పీఎం కిసాన్ నిధులతో పాటే వీటి నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే త్వరలోనే ఈ నిధులను జమ చేసే అవకాశం ఉంది.
(2 / 7)
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.
(3 / 7)
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.
(4 / 7)
అయితే పీఎం కిసాన్ నిధులను జూలై లో విడుదల చేసే అవకాశం ఉంది. వీటితో కలిపే ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులను కూడా జత చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం అధికారులు కసరత్తు చేస్తుండగా… తాజాగా ముఖ్యమైన ప్రకటన చేశారు.
(5 / 7)
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని సూచించారు.
(6 / 7)
సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు.
(7 / 7)
ఇప్పుడు నమోదు చేసుకునే రైతులకు సంబంధించి…. అక్టోబర్ నెలతో పాటు 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ మొత్తాన్ని అందిస్తామని అధికారులు చెప్పారు.
ఇతర గ్యాలరీలు