'అన్నదాత సుఖీభవ స్కీమ్' అప్డేట్ - మీ పేర్లను వెంటనే నమోదు చేసుకోండి...!-latest updates about ap annadata sukhibhava scheme details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'అన్నదాత సుఖీభవ స్కీమ్' అప్డేట్ - మీ పేర్లను వెంటనే నమోదు చేసుకోండి...!

'అన్నదాత సుఖీభవ స్కీమ్' అప్డేట్ - మీ పేర్లను వెంటనే నమోదు చేసుకోండి...!

Published Jun 28, 2025 02:00 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 28, 2025 02:00 PM IST

ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రైతుల నుంచి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఈ-పంటలో నమోదవ్వాలని సూచించారు. ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…..

అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. పీఎం కిసాన్ నిధులతో పాటే వీటి నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే త్వరలోనే ఈ నిధులను జమ చేసే అవకాశం ఉంది.

(1 / 7)

అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. పీఎం కిసాన్ నిధులతో పాటే వీటి నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే త్వరలోనే ఈ నిధులను జమ చేసే అవకాశం ఉంది.

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.

(2 / 7)

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

(3 / 7)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

అయితే పీఎం కిసాన్ నిధులను జూలై లో విడుదల చేసే అవకాశం ఉంది. వీటితో కలిపే ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులను కూడా జత చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం అధికారులు కసరత్తు చేస్తుండగా… తాజాగా ముఖ్యమైన ప్రకటన చేశారు.

(4 / 7)

అయితే పీఎం కిసాన్ నిధులను జూలై లో విడుదల చేసే అవకాశం ఉంది. వీటితో కలిపే ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులను కూడా జత చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం అధికారులు కసరత్తు చేస్తుండగా… తాజాగా ముఖ్యమైన ప్రకటన చేశారు.

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని సూచించారు.

(5 / 7)

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని సూచించారు.

సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు.

(6 / 7)

సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు.

ఇప్పుడు నమోదు చేసుకునే రైతులకు సంబంధించి….  అక్టోబర్ నెలతో పాటు 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని అధికారులు చెప్పారు.

(7 / 7)

ఇప్పుడు నమోదు చేసుకునే రైతులకు సంబంధించి…. అక్టోబర్ నెలతో పాటు 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని అధికారులు చెప్పారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు