(1 / 8)
ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే అర్హులైన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అర్హత లేని రైతుల నుంచి అర్జీలను స్వీకరిస్తోంది. వీటిని పరిశీలించి… అర్హులను ఎంపిక చేయనుంది.
(2 / 8)
అనర్హులైన రైతులు అర్జీలను పెట్టుకోవచ్చు. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు వెంటనే
గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుడు, లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. తగిన వివరాలను సమర్పించి….అర్జీని పెట్టుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
(3 / 8)
గ్రామాల్లోని రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదులు ఇస్తే…. అక్కడ సిబ్బంది పరిశీలిస్తారు. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్ పోర్టల్లో ఎంట్రీ చేస్తారని అధికారులు వివరించారు. కాబట్టి… అర్హుల లిస్ట్ లో పేర్లు లేని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యం చేేయకుండా ఈ ప్రాసెస్ చేసుకోవాలని చెబుతున్నారు,.
(4 / 8)
సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు…. లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఈ-పంటలో నమోదవ్వాలని అధికారులు తాజాగా సూచించారు.
(5 / 8)
అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? మీరే సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. దీనిబట్టి మీరు అర్జీని పెట్టుకోవాలా లేదా అనేది తెలుస్తుంది. ఇందుకోసం ముందుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వెబ్ సైట్ లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ పై క్లిక్ చేయండి. హోంపేజీలోని 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి. రైతు ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 'Search' ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ చూపిస్తుంది. స్టేటస్ 'Approved' అని ఉంటే అన్నదాత సుఖీభ పథకానికి అర్హులవుతారు.
(6 / 8)
ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. అయితే అనర్హులుగా ఉన్న వారి దరఖాస్తులను పరిశీలించి… మరికొందరికి కూడా వర్తింపజేస్తారు.
(7 / 8)
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది.
(8 / 8)
మొత్తం 3 విడతల్లో అన్నదాత సుఖీభవ డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ స్కీమ్ కు అర్హత సాధించని రైతుల కోసం ఏపీ సర్కార్… ప్రత్యేకంగా 155251 నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇతర గ్యాలరీలు