చలో బస్‌ భవన్‌.. ఆర్టీసీ బస్సుల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌-ktr and harish rao participated in brs chalo bus bhavan demand for rtc ticket price reduce ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చలో బస్‌ భవన్‌.. ఆర్టీసీ బస్సుల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌

చలో బస్‌ భవన్‌.. ఆర్టీసీ బస్సుల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌

Published Oct 09, 2025 01:18 PM IST Anand Sai
Published Oct 09, 2025 01:18 PM IST

హైదరాబాద్ సిటీ బస్సులో ఛార్జీల పెంపును నిరసిస్తూ.. బీఆర్ఎస్ చలో బస్‌ భవన్‌ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ చేపట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం అందించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, లాక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి, పార్టీ నేతలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్‌ భవన్‌ చేరుకున్నారు.

(1 / 4)

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, లాక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి, పార్టీ నేతలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్‌ భవన్‌ చేరుకున్నారు.

రేతిఫైల్ బస్ స్టేషన్ నుంచి బస్ భవన్ కు ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటుగా ముఖ్యనేతలు ప్రయాణించారు. అనంతరం బస్ భవన్‌లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.

(2 / 4)

రేతిఫైల్ బస్ స్టేషన్ నుంచి బస్ భవన్ కు ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటుగా ముఖ్యనేతలు ప్రయాణించారు. అనంతరం బస్ భవన్‌లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.

గ్రేటర్‌ పరిధిలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ తరఫున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

(3 / 4)

గ్రేటర్‌ పరిధిలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ తరఫున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రూ. 1353 కోట్లు 'మహాలక్ష్మి' ఉచిత బస్సు పథకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి  తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ. 9246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్‌ను(TGSRTC కింద) విడుదల చేసినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా చేసి, ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.

(4 / 4)

రూ. 1353 కోట్లు 'మహాలక్ష్మి' ఉచిత బస్సు పథకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ. 9246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్‌ను(TGSRTC కింద) విడుదల చేసినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా చేసి, ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు