తెలుగు న్యూస్ / ఫోటో /
Railway : రైలులో ఏదైనా మర్చిపోయారా? ఈ నెంబర్కు కాల్ చేసి ఇలా ఈజీగా తిరిగి పొందవచ్చు
- Indian Railway : చాలా మంది రైలులో ముఖ్యమైన వస్తువులను మర్చిపోతారు. తరువాత ఆ వస్తువును ఎలా తిరిగిపొందాలో తెలియక తికమక పడుతారు. అలాంటివారి కోసం ఈ వార్త ఉపయోగపడుతుంది.
- Indian Railway : చాలా మంది రైలులో ముఖ్యమైన వస్తువులను మర్చిపోతారు. తరువాత ఆ వస్తువును ఎలా తిరిగిపొందాలో తెలియక తికమక పడుతారు. అలాంటివారి కోసం ఈ వార్త ఉపయోగపడుతుంది.
(1 / 6)
కొన్నిసార్లు రైలులో ఏదో ఒక వస్తువు మరిచిపోతాం. అది బ్యాగ్ కావొచ్చు, ఛార్జర్ కావొచ్చు.. మరేదైనా వస్తువు అయి ఉండొచ్చు. ఇంతలో అప్పటికే రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. కానీ తర్వాత ఆ వస్తువు పోయినట్టే అని అనుకుంటారు. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆ వస్తువును ఈజీగా తిరిగి పొందవచ్చు.
(2 / 6)
139కు ఫోన్ చేసి మొత్తం సంఘటనను నివేదించాలి. మొదట మీ బ్యాగ్ లేదా ఇతర వస్తువులు పోయాయని వారికి తెలియజేయడానికి రైల్వే 139 కు కాల్ చేయండి. ఐటమ్ వివరాలతో పాటు మీ ఫోన్ నంబర్, పేరు మొదలైనవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
(3 / 6)
మీరు ఏ రైలు ఎక్కారు, ఎప్పుడు దిగారు, ఏ స్టేషన్లో దిగారు అనే సమాచారాన్ని కూడా ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ సమాచారం ఆధారంగా రైల్వే గార్డులు రైలు ఎక్కడుందో వెతకడం ప్రారంభిస్తారు.
(4 / 6)
ఎవరైనా ఇతరులు మీ బ్యాగ్ లేదా వస్తువులను తీసుకెళ్లకుంటే దొరుకుతుంది. అనంతరం నిర్దేశిత స్టేషన్లో సమర్పిస్తారు. అక్కడి నుంచి ప్రయాణికుడు దాన్ని సేకరించాల్సి ఉంటుంది.
(5 / 6)
'ఆపరేషన్ అమానత్' పేరుతో చేపట్టిన ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా మారింది. భారతీయ రైల్వే ఈ పద్ధతి ద్వారా కోల్పోయిన చాలా వస్తువులను క్రమం తప్పకుండా తిరిగి ఇస్తోంది. వాలెట్లు, ఫోన్లు, చార్జర్లు మొదలైనవి ఈ వస్తువులలో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు