(1 / 6)
వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడు 2024 లో ఎటువంటి సంచారం చేయలేదు. కానీ ఇప్పుడు 2025 లో శని మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రత్యేకత ఏంటంటే మీనంలో శని సంచారం రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇలాంటి యాదృచ్ఛికత చాలా అరుదుగా కనిపిస్తుంది. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది కానీ దాని ప్రభావం ముఖ్యంగా మూడు రాశులపై కనిపిస్తుంది.
(2 / 6)
2025 లో సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. అలాగే, శని ఈ రోజు రాత్రి 11.01 గంటలకు మీనంలోకి ప్రవేశిస్తాడు. రెండున్నరేళ్లు ఇక్కడే ఉంటాడు.
(3 / 6)
ఆ తర్వాత 2027 జూన్ 3న శనీశ్వరుడు మళ్లీ మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే శని రెండున్నర సంవత్సరాల పాటు మీనంలో ఉంటాడు. ఈ అద్భుతమైన కలయిక నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతున్న రాశుల వారు ఎవరో చూడండి.
(4 / 6)
సింహం : సూర్యుడే సింహ రాశికి అధిపతి. ఇక మీకున్న సమస్యలన్నీ ముగిసినట్లే. అందుకే శని అనుగ్రహం వల్ల మీకు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఆఫీసుల్లో గౌరవం దొరుతుంది.వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. బ్యాక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
(5 / 6)
తులా రాశి : శని మీకు ఆనందాలు ప్రసాదించబోతున్నాడు, ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. మీ శ్రమ ఫలిస్తుంది. మీరు వ్యాపారం చేస్తే, మీకు పెద్ద డీల్ లభిస్తుంది. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది.
(6 / 6)
మీనం: శని దేవుడు మీకు చాలా ఆనందాల్ని ఇవ్వబోతున్నారు, కాబట్టి 2025 సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి. శనియే మీరు ముందుకు సాగడానికి మార్గం సుగమం చేస్తుంది. మీరు ఒక ఉద్యోగం చేస్తే, అందులో గొప్ప ఫలితాలు చూస్తారు. బోలెడంత డబ్బు సంపాదిస్తారు.
ఇతర గ్యాలరీలు