'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - కేవలం వారికి మాత్రమే ఈకేవైసీ..! మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి-key updates about ap govt annadata sukhibhava scheme over ekyc process ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - కేవలం వారికి మాత్రమే ఈకేవైసీ..! మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి

'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - కేవలం వారికి మాత్రమే ఈకేవైసీ..! మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి

Published Jun 17, 2025 05:10 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 17, 2025 05:10 PM IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. పీఎం కిసాన్ నిధులతో పాటే ఈ నిధులను విడుదల చేయనుంది. అయితే ఈకేవైసీ విషయంలో రైతులు ఆందోళన చెందుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు(ఆర్‌ఎస్‌కే) వచ్చి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది.

(1 / 6)

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20 వేలను అందజేయనుంది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

(2 / 6)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20 వేలను అందజేయనుంది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

రైతులంతా ఈకేవైసీ (వేలిముద్ర) పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు ఇటీవలే పలు ప్రకటనలు చేశారు. దీంతో రైతులంతా రైతు సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు తమకు స్కీమ్ వర్తింపజేస్తారా లేదా అన్న ఆందోళనలో కూడా రైతులు ఉంటున్నారు.

(3 / 6)

రైతులంతా ఈకేవైసీ (వేలిముద్ర) పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు ఇటీవలే పలు ప్రకటనలు చేశారు. దీంతో రైతులంతా రైతు సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు తమకు స్కీమ్ వర్తింపజేస్తారా లేదా అన్న ఆందోళనలో కూడా రైతులు ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  అర్హులు అంతా ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాల(RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించింది.

(4 / 6)

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులు అంతా ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాల(RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించింది.

సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆ రైతుల వివరాలను RSKలకు పంపింది. ఈ నెల 20కల్లా ఈ ప్రక్రియ పూర్తికానుందని పేర్కొంది.

(5 / 6)

సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆ రైతుల వివరాలను RSKలకు పంపింది. ఈ నెల 20కల్లా ఈ ప్రక్రియ పూర్తికానుందని పేర్కొంది.

 అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది. దీనిబట్టి ఈకేవైసీ విషయంలో కూడా ఓ క్లారిటీకి రావొచ్చు.

(6 / 6)

అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది. దీనిబట్టి ఈకేవైసీ విషయంలో కూడా ఓ క్లారిటీకి రావొచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు