ప్రతి రైతు ఖాతాలోకి రూ. 7 వేలు..! 'అన్నదాత సుఖీభవ' స్కీమ్ పై కీలక అప్డేట్-key update on the release of ap annadata sukhibhav scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రతి రైతు ఖాతాలోకి రూ. 7 వేలు..! 'అన్నదాత సుఖీభవ' స్కీమ్ పై కీలక అప్డేట్

ప్రతి రైతు ఖాతాలోకి రూ. 7 వేలు..! 'అన్నదాత సుఖీభవ' స్కీమ్ పై కీలక అప్డేట్

Published Jun 07, 2025 10:56 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 07, 2025 10:56 AM IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. పీఎం కిసాన్ నిధులతో పాటే వీటి నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.

(1 / 7)

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

(2 / 7)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

ఈ నిధుల కోసం ఏపీ అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడదలైతే అదే రోజు సుఖీభవ స్కీమ్ డబ్బులను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే పీఎం కిసాన్ నిధులు విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

(3 / 7)

ఈ నిధుల కోసం ఏపీ అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడదలైతే అదే రోజు సుఖీభవ స్కీమ్ డబ్బులను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే పీఎం కిసాన్ నిధులు విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

పీఎం కిసాన్‌ కింద జూన్  20వ తేదీన ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5వేల చొప్పున జమచేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు రూ.7వేలు అందుతాయి.

(4 / 7)

పీఎం కిసాన్‌ కింద జూన్ 20వ తేదీన ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5వేల చొప్పున జమచేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు రూ.7వేలు అందుతాయి.

జూన్ 20వ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే… దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవ నిధులను జత చేస్తుంది.

(5 / 7)

జూన్ 20వ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే… దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవ నిధులను జత చేస్తుంది.

ఇక రెండో విడతగా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.7వేలు, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం రూ.4వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.6వేలను రైతుల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి.

(6 / 7)

ఇక రెండో విడతగా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.7వేలు, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం రూ.4వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.6వేలను రైతుల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి.

అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

(7 / 7)

అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు