రైతు భరోసా స్కీమ్ : కొత్త రైతులు వెంటనే ఇలా చేయండి - లేకుంటే డబ్బులు పడే ఛాన్స్ మిస్ అవుతారు..!-key update about telangana rythu bharosa scheme applications last date ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రైతు భరోసా స్కీమ్ : కొత్త రైతులు వెంటనే ఇలా చేయండి - లేకుంటే డబ్బులు పడే ఛాన్స్ మిస్ అవుతారు..!

రైతు భరోసా స్కీమ్ : కొత్త రైతులు వెంటనే ఇలా చేయండి - లేకుంటే డబ్బులు పడే ఛాన్స్ మిస్ అవుతారు..!

Published Jun 19, 2025 11:39 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 19, 2025 11:39 AM IST

తెలంగాణలో ‘రైతు భరోసా స్కీమ్’ నిధులు జమవుతున్నాయి. ఇప్పటికే ఎకరాల వారీగా రైతుల ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి. అయితే కొత్త రైతులు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు జూన్ 20వ తేదీతో పూర్తవుతుంది. ఈలోపే అప్లికేషన్ చేసుకుంటే.. వీరికి కూడా పంట పెట్టుబడి సాయం అందుతుంది.

పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సీజన్ రావటంతో… ఈ స్కీమ్ కింద ఇచ్చే డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది.

(1 / 7)

పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సీజన్ రావటంతో… ఈ స్కీమ్ కింద ఇచ్చే డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది.

జూన్ 16వ తేదీ నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తున్నారు. అయితే కొత్తగా పట్టాదారు పుస్తకం వచ్చిన వాళ్లు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వ్యవసాయశాఖ కల్పించింది.

(2 / 7)

జూన్ 16వ తేదీ నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తున్నారు. అయితే కొత్తగా పట్టాదారు పుస్తకం వచ్చిన వాళ్లు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వ్యవసాయశాఖ కల్పించింది.

05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు కూడా… రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అయితే వీరంతా జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

(3 / 7)

05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు కూడా… రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అయితే వీరంతా జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

(image source unsplash)

కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది. జూన్ 20లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

(4 / 7)

కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది. జూన్ 20లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

(image source .istockphoto.com)

గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది. వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ కూడా రేపటిలోపే పూర్తి చేసుకోవాలి.

(5 / 7)

గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది. వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ కూడా రేపటిలోపే పూర్తి చేసుకోవాలి.

జూన్ 20లోపు వచ్చిన కొత్త దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలిస్తారు. అర్హులను గుర్తించి… ప్రస్తుతం ఇస్తున్న విడత కిందనే డబ్బులను జమ చేస్తారు. కాబట్టి అర్హత ఉన్న రైతులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

(6 / 7)

జూన్ 20లోపు వచ్చిన కొత్త దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలిస్తారు. అర్హులను గుర్తించి… ప్రస్తుతం ఇస్తున్న విడత కిందనే డబ్బులను జమ చేస్తారు. కాబట్టి అర్హత ఉన్న రైతులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.

(7 / 7)

రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు