KCR : కాకా హోటల్ లో కేసీఆర్, ఛాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు
- KCR : ఖమ్మం బస్సు యాత్ర మార్గంలో ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఛాయ్ హోటల్ వద్ద ఆగిన కేసీఆర్..స్థానికులతో ముచ్చటించారు.
- KCR : ఖమ్మం బస్సు యాత్ర మార్గంలో ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఛాయ్ హోటల్ వద్ద ఆగిన కేసీఆర్..స్థానికులతో ముచ్చటించారు.
(1 / 7)
ఖమ్మం బస్సు యాత్ర మార్గంలో ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఛాయ్ హోటల్ వద్ద ఆగిన కేసీఆర్..స్థానికులతో ముచ్చటించారు. సామాన్యమైన తమ హోటల్ కు వచ్చిన కేసీఆర్ ను చూసి హోటల్ యజమాని, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
(2 / 7)
హోటల్ నిర్వాహకులు ఎంతో ప్రేమతో మిర్చిబజ్జిలను కేసీఆర్ కు అందించారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన కేసీఆర్ కాసేపు వారితో ముచ్చటించారు
వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
(3 / 7)
స్థానికుల కష్టాలు తెలుసుకుంటూ హోటల్ యజమాని సొందు అందించిన ఛాయ్ తాగారు కేసీఆర్. తండా సర్పంచ్ లాల్సింగ్ సహా పలువురు
కేసీఆర్ వస్తున్నారని తెలిసి అక్కడకు చేరుకున్నారు.
(4 / 7)
రైతులు తమకు రైతు బంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, నీళ్లందక పొలాలు ఎండిపోయినాయని, కరెంటు రాట్లేదని తమ బాధలను కేసీఆర్ తో వ్యక్తం చేశారు. పలువురు వికలాంగులు, మహిళలు, వృద్ధులు కేసీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
(5 / 7)
యువతీయువకులు కేసీఆర్ తో సెల్ఫీలు దిగారు. వారికి ఆప్యయంగా కేసీఆర్ కరచాలనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని వారికి తాను అండగా ఉంటానని కేసీఆర్ అన్నారు.
(6 / 7)
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని.. రైతాంగం తరఫున తాను పంచాతీ పంజ్ వలె కొట్లాడి రైతు బంధు సహా అన్ని హామీలను సాధిస్తానని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు.
ఇతర గ్యాలరీలు