(1 / 4)
గురువారం సాయంత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
(2 / 4)
చినుకు జాడ లేక ఆగమవుతున్న అన్నదాతకు.. కదిలివస్తున్న కాళేశ్వర జలాలు కల్పతరువుగా మారనున్నాయని ప్రజాప్రతినిధులు చెప్పారు.
(3 / 4)
లక్ష్మీ పంప్హౌస్ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్ బరాజ్లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలిస్తున్న సంగతి తెలిసిందే.
(4 / 4)
మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ పంప్హౌస్కు తరలింపు ప్రక్రియ చేపట్టగా… కాళేశ్వరం జలాలు బిరబిరమంటూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెంతకు గురువారం సాయంత్రానికి చేరుకొన్నాయి.
(twitter)ఇతర గ్యాలరీలు