Jay Shah: ఐసీసీ చైర్మన్‍ పదవి జై షాకు దక్కనుందా? ఈ వారమే సమావేశాలు-jay shah reportedly to take over as icc chairman agm this week ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jay Shah: ఐసీసీ చైర్మన్‍ పదవి జై షాకు దక్కనుందా? ఈ వారమే సమావేశాలు

Jay Shah: ఐసీసీ చైర్మన్‍ పదవి జై షాకు దక్కనుందా? ఈ వారమే సమావేశాలు

Published Jul 17, 2024 10:42 PM IST Chatakonda Krishna Prakash
Published Jul 17, 2024 10:42 PM IST

  • Jay Shah: ఐసీసీ చైర్మన్ పదవిని జై షా దక్కించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ వారం ఐసీసీ ఏజీఎం మీటింగ్ ఉండటంతో ఈ విషయంపై రూమర్లు జోరుగా వస్తున్నాయి.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా… ఐసీసీ పదవికి రెడీ అవుతున్నారని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తదుపరి చైర్మన్‍గా జై షా నియమితులవుతారని అంచనాలు ఉన్నాయి. 

(1 / 5)

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా… ఐసీసీ పదవికి రెడీ అవుతున్నారని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తదుపరి చైర్మన్‍గా జై షా నియమితులవుతారని అంచనాలు ఉన్నాయి. 

(PTI)

ఐసీసీ వార్షిక సమావేశాలు (ఏజీఎం) శ్రీలంకలోని కొలంబోలో ఈ శుక్రవారం (జూలై 19) నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్నాయి. ఐసీసీ తదుపరి చైర్మన్ ఎవరనే విషయంపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. 

(2 / 5)

ఐసీసీ వార్షిక సమావేశాలు (ఏజీఎం) శ్రీలంకలోని కొలంబోలో ఈ శుక్రవారం (జూలై 19) నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్నాయి. ఐసీసీ తదుపరి చైర్మన్ ఎవరనే విషయంపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. 

ప్రస్తుత ఐసీసీ చైర్మన్‍ గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో ఈ ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్ పదవిని జై షా చేపడతారనే అంచనాలు ఉన్నాయి.

(3 / 5)

ప్రస్తుత ఐసీసీ చైర్మన్‍ గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో ఈ ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్ పదవిని జై షా చేపడతారనే అంచనాలు ఉన్నాయి.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍ 2024 టోర్నీని అమెరికా, వెస్టిండీస్‍ల్లో ఐసీసీ నిర్వహించింది. అయితే, అమెరికా మ్యాచ్‍లు నిర్వహించడం వల్ల వచ్చిన నష్టాల గురించి కూడా ఈ ఏజీఎంలో ఐసీసీ ప్రతినిధులు చర్చించనున్నారు.

(4 / 5)

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍ 2024 టోర్నీని అమెరికా, వెస్టిండీస్‍ల్లో ఐసీసీ నిర్వహించింది. అయితే, అమెరికా మ్యాచ్‍లు నిర్వహించడం వల్ల వచ్చిన నష్టాల గురించి కూడా ఈ ఏజీఎంలో ఐసీసీ ప్రతినిధులు చర్చించనున్నారు.

(AP)

2025 చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‍కు టీమిండియా వెళ్లే ప్రసక్తే లేదని కూడా ఐసీసీ ఏజీఎంలో జై షా స్పష్టంగా చెబుతారనే అంచనాలు ఉన్నాయి. దీంతో భారత్ మ్యాచ్‍లకు తటస్థ వేదిక సహా ప్రత్యామ్నాయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

(5 / 5)

2025 చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‍కు టీమిండియా వెళ్లే ప్రసక్తే లేదని కూడా ఐసీసీ ఏజీఎంలో జై షా స్పష్టంగా చెబుతారనే అంచనాలు ఉన్నాయి. దీంతో భారత్ మ్యాచ్‍లకు తటస్థ వేదిక సహా ప్రత్యామ్నాయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు