SaradaPeetham: భీమిలీలో శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు చేయాలని జనసేన, స్వామిజీలు ఆందోళన
- స్వరూపానంద స్వామిజీకి భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలని, శారదాపీఠం ఆస్తులపై సీబీఐ, ఈడీలతో విచారణ జరపాలని, నకిలీ శారదాపీఠాన్ని మూసేసి అటువంటివి రాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద,జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
- స్వరూపానంద స్వామిజీకి భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలని, శారదాపీఠం ఆస్తులపై సీబీఐ, ఈడీలతో విచారణ జరపాలని, నకిలీ శారదాపీఠాన్ని మూసేసి అటువంటివి రాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద,జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
(2 / 8)
శారదాపీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి, గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయించిన 15 ఎకరాల భూకేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది.
(3 / 8)
స్వరూపానంద స్వామిజీకి భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలని,
శారదాపీఠం ఆస్తులపై సీబీఐ, ఈడీలతో విచారణ జరపాలని, నకిలీ శారదాపీఠాన్ని మూసేసి అటువంటివి రాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద,జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
(4 / 8)
జనసేన నేతలు పలువురు స్వాములతో కలసి వీరు భీమిలి మండలం కొత్త వలస గ్రామం సర్వే 102-2 , 103 లలో స్వరూపానందకు భీమునికొండపై కేటాయించిన భూములను సందర్శించారు.
(5 / 8)
స్వరూపానంద వేద పాఠశాల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేయించుకొన్నారని స్వామిజీలు ఆరోపించారు. అసలు పీఠానికే గుర్తింపు లేనప్పుడు, వేద విద్యార్ధులే ఇక్కడ శిక్షణ పొందనప్పుడు జగన్ ప్రభుత్వం గుడ్డిగా 15 ఎకరాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని కేటాయింపు రద్దు చేయాలని డిమాండు చేశారు.
(6 / 8)
భూకేటాయింపులు ద్వారా పొందిన భూములను వ్యాపార అవసరాలకు వాడతామని శారదాపీఠం ఉత్తరాధికారిగా చెప్పుకొనే సాత్మానంద మూడు నెలల క్రితం ప్రభుత్వానికి లేఖ రాసి తమ ఉద్దేశాలను బహిర్గతం చేశారని, ఈ లేఖ ఆధారంగా కేటాయింపులను నిముషంలోరద్దు చేయవచ్చని స్వామిజీలు చెప్పారు.
(7 / 8)
స్వరూపానందకు కేటాయించిన భూమి పాండవులలో ఒకరైన భీముడు కూర్చున్న స్ధలం అని స్ధానికులు నమ్మకమని, దానిని తవ్వకాలు, కట్టడాల పేరిట ధ్వంసం చేయడం తగదని స్వామిజీలు అన్నారు. భీముని పట్నానికి పేరు కూడా భీముడి వల్లే వచ్చిందని గుర్తుచేశారు. స్వరూపానందకు కేటాయించిన స్ధలంలో అత్యంత విలువైన ఔషదిమొక్కలు, చిన్న చిన్న అటవీ జంతువులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నదని అన్నారు.
(8 / 8)
స్వరూపానంద కోసం రెండు కోట్లతో ఆయనకు కేటాయించిన భూమికి ఘాట్ రోడ్ వేసిన వీఎంఆర్డీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఇందుకు బాధ్యులను గుర్తించి ఈ రెండు కోట్ల రూపాయలను వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. రహదారి కోసం తవ్విన గ్రావెల్ ను కోట్ల రూపాయలకు అమ్ముకొన్నట్లు ఆరోపణలు వున్నందున దానినీ రికవరీ చేయాల్సిన అవసరం వుందని శ్రీనివాసానంద, మూర్తి యావద్ లు అన్నారు. ఇప్పటికే కొండ ను చాలా వరకూ ధ్వంసం చేశారని ఇకపై జరగకుండాచూడాలని కోరారు.
ఇతర గ్యాలరీలు