(1 / 6)
వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. ఇక వీకెండ్లో సింహాచలం వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ వచ్చేసింది. 'వైజాగ్ బ్లిస్' పేరుతో IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
(2 / 6)
వైజాగ్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. . ఇందులో భాగంగా సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇది 2 రోజులు, ఒక నైట్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 27, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు.
(image source istockphoto.com)(3 / 6)
ఫస్ట్ డే వైజాగ్ లోని హోటల్ కి వెళ్లి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్తారు. అనంతరం రిషికొండ బీచ్, కైలాస్ గిరి వెళ్తారు. తిరిగి హోటల్ కు వస్తారు. రాత్రి బోజనం తర్వాత... విశాఖలోనే బస చేస్తారు.
(4 / 6)
2వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అయితారు. సింహాచలం వెళ్తారు. దర్శనం తర్వాత విశాఖపట్నం వస్తారు. లంచ్ తర్వాత సబ్ మెరైన్ మ్యూజియం చేస్తారు. సోమవారం మాత్రం క్లోజ్ ఉంటుంది. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(5 / 6)
వైజాగ్ - సింహాచలం ట్రిప్ ధరలు : సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 10475గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 5740, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4165గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫర్ట్ క్లాస్ లో ఉన్నాయి. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
(6 / 6)
ఈ లింక్ పై క్లిక్ చేసి సింహాచలం టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932318, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు.
(unsplash.com/)ఇతర గ్యాలరీలు