IRCTC Araku Tour : ఒకే ట్రిప్ లో వైజాగ్, అరకు అందాలను చూడొచ్చు..! హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు-irctc tourism to operate jewel of east coast tour package to araku from hyderabad in march month 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Araku Tour : ఒకే ట్రిప్ లో వైజాగ్, అరకు అందాలను చూడొచ్చు..! హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

IRCTC Araku Tour : ఒకే ట్రిప్ లో వైజాగ్, అరకు అందాలను చూడొచ్చు..! హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Published Mar 08, 2025 11:02 AM IST Maheshwaram Mahendra Chary
Published Mar 08, 2025 11:02 AM IST

  • ఈ వేసవి వేళ IRCTC టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. వైజాగ్, అరకు ప్రాంతాలను చూపించనుంది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది. ట్రైన్ జర్నీ ద్వారా వైజాగ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ షెడ్యూల్, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

సమ్మర్ వచ్చేసింది…! చాలా మంది టూర్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే టూరిస్టుల కోసం IRCTC టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో పడింది. 

(1 / 8)

సమ్మర్ వచ్చేసింది…! చాలా మంది టూర్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే టూరిస్టుల కోసం IRCTC టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో పడింది.
 
(Facebook)

వైజాగ్, అరకు అందాలను చూసేందుకు ఐఆర్ సీటీసీ టూరిజం తాజాగ్ కొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. “JEWEL OF EAST COAST” పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది.

(2 / 8)

వైజాగ్, అరకు అందాలను చూసేందుకు ఐఆర్ సీటీసీ టూరిజం తాజాగ్ కొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. “JEWEL OF EAST COAST” పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 12 మార్చి. 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. సంబంధిత తేదీల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడాల్సి ఉంటుంది.

(3 / 8)

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 12 మార్చి. 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. సంబంధిత తేదీల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడాల్సి ఉంటుంది.

(image source AP Tourism)

ఈ ప్యాకేజీ మొత్తం ఐదు రోజులు ఉంటుంది. మొదటి రోజు హైదరాబాద్ రైల్వే స్టేషన్(Train No. 12728 ) నుంచి సాయంత్రం 5.05 గంటలకు బయల్దేరుతారు. ఉదయం 5.55 కు విశాఖకు చేరుతారు. హోటల్ లో కి చెకిన్ అయిన తర్వాత… బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. నేరుగా కాళీ మాతా దర్శనం, సబ్ మెరైన్ మ్యూజియం చేస్తారు. ఆ తర్వాత లంచ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి, రుషికొండ బీచ్ చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.

(4 / 8)

ఈ ప్యాకేజీ మొత్తం ఐదు రోజులు ఉంటుంది. మొదటి రోజు హైదరాబాద్ రైల్వే స్టేషన్(Train No. 12728 ) నుంచి సాయంత్రం 5.05 గంటలకు బయల్దేరుతారు. ఉదయం 5.55 కు విశాఖకు చేరుతారు. హోటల్ లో కి చెకిన్ అయిన తర్వాత… బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. నేరుగా కాళీ మాతా దర్శనం, సబ్ మెరైన్ మ్యూజియం చేస్తారు. ఆ తర్వాత లంచ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి, రుషికొండ బీచ్ చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.

(Twitter)

మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత వైజాగ్ నుంచి అరకు వెళ్తారు. Tyda జంగల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్ చూస్తారు. ఆ తర్వాత ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత…. గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శిస్తారు. రాత్రి తిరిగి వైజాగ్ కు చేరుకుంటారు, 

(5 / 8)

మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత వైజాగ్ నుంచి అరకు వెళ్తారు. Tyda జంగల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్ చూస్తారు. ఆ తర్వాత ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత…. గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శిస్తారు. రాత్రి తిరిగి వైజాగ్ కు చేరుకుంటారు,
 

నాల్గో రోజు ఉదయం సింహాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఆర్కే బీచ్ కు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు వైజాగ్ లో రిటర్న్ జర్నీ ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీలోనే ఉంటారు. ఉదయం 4.15 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో ట్రిప్ ముగుస్తుంది. 

(6 / 8)

నాల్గో రోజు ఉదయం సింహాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఆర్కే బీచ్ కు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు వైజాగ్ లో రిటర్న్ జర్నీ ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీలోనే ఉంటారు. ఉదయం 4.15 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో ట్రిప్ ముగుస్తుంది.
 

(image source .istockphoto.com)

సింగిల్ షేరింగ్ కు రూ. 27910, డబుల్ షేరింగ్ రూ. 17010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,370గా ఉంది. ఈ ధరలు కంఫర్ట్ 3ఏ క్లాస్ లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11480, డబుల్ షేరింగ్ కు రూ. 15,110గా నిర్ణయించారు.  

(7 / 8)

సింగిల్ షేరింగ్ కు రూ. 27910, డబుల్ షేరింగ్ రూ. 17010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,370గా ఉంది. ఈ ధరలు కంఫర్ట్ 3ఏ క్లాస్ లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11480, డబుల్ షేరింగ్ కు రూ. 15,110గా నిర్ణయించారు. 
 

(Facebook)

ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

(8 / 8)

లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

(image source IRCTC Tourism)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు