సమ్మర్ వేళ 'కర్ణాటక' ట్రిప్ వెళ్తారా..? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు-irctc tourism to operate coastal karnataka tour package from hyderabad in may 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సమ్మర్ వేళ 'కర్ణాటక' ట్రిప్ వెళ్తారా..? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

సమ్మర్ వేళ 'కర్ణాటక' ట్రిప్ వెళ్తారా..? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Updated Apr 27, 2025 01:17 PM IST Maheshwaram Mahendra Chary
Updated Apr 27, 2025 01:17 PM IST

ఈ సమ్మర్ వేళ కర్ణాటక తీర ప్రాంతంలోని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేయనుంది. మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి వంటి ఆలయాలను చూస్తారు. ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

సమ్మర్ కావటంతో చాలా మంది అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలోనే IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది.

(1 / 7)

సమ్మర్ కావటంతో చాలా మంది అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలోనే IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది.

(pixabay)

"Coastal Karnataka' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ట్రిప్ లో….మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేషన్ ఉంటుంది.

(2 / 7)

"Coastal Karnataka' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ట్రిప్ లో….మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేషన్ ఉంటుంది.

(pixabay)

ఈ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం 06 మే 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

(3 / 7)

ఈ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం 06 మే 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

(pixabay)

ఫస్ట్ డే కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు ట్రైన్ (Train No.12789) బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpe బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.

(4 / 7)

ఫస్ట్ డే కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు ట్రైన్ (Train No.12789) బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpe బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.

(pixabay)

నాల్గో రోజు Hornadu కు చేరుకుంటారు. అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శిస్తారు.  ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు. ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 7)

నాల్గో రోజు Hornadu కు చేరుకుంటారు. అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు. ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ధరలు :  సింగిల్ షేరింగ్ కు రూ.39,140ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22,710 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18,180గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి.  స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36,120గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19,690, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15150గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి.

(6 / 7)

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.39,140ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22,710 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18,180గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36,120గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19,690, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15150గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి.

(pixabay)

 ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా వివరాలు తెలుసుకునేందుకు 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

(7 / 7)

లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా వివరాలు తెలుసుకునేందుకు 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

(pixabay)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు