తెలుగు న్యూస్ / ఫోటో /
Coastal Karnataka Tour 2025: న్యూ ఇయర్ లో కర్ణాటక ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలు
- Hyderabad Coastal Karnataka Tour : వచ్చే కొత్త సంవత్సరంలో కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా? మీకోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చూసే ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి…..
- Hyderabad Coastal Karnataka Tour : వచ్చే కొత్త సంవత్సరంలో కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా? మీకోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చూసే ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి…..
(1 / 8)
వచ్చే న్యూ ఇయర్ కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.(image source unsplash.com)
(2 / 8)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జనవరి 7, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. (image source unsplash.com)
(3 / 8)
ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ కనిపిస్తుంది. రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. (image source from unsplash.com)
(4 / 8)
రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు. (image source unsplash.com)
(5 / 8)
4వ రోజు హోర్నాడ్ కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు. (image source unsplash.com)
(6 / 8)
ఐదో రోడు మంగళూరుకు చేరుకుంటారు. Mangala Devi ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.(image source unsplash.com)
(7 / 8)
హైదరాబాద్ - కర్ణాటక ట్రిప్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.39140 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22710 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18180గా ఉంది. కంఫర్ట్ క్లాస్ ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36120గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. (twitter)
ఇతర గ్యాలరీలు