(1 / 6)
ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. తాజాగా తిరుపతి నుంచి షిర్డీకి సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.
(2 / 6)
“SAI SANNIDHI EX TIRUPATI” పేరుతో ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. రైలు మార్గంలో షిరిడీకి తీసుకెళ్లి సాయిబాబా దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంది. శనిశిగ్నాపూర్ కూడా వెళ్లి రావొచ్చు. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్సీటీసీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఈ టూర్ నవంబరు 14, 2023వ తేదీన అందుబాటులో ఉంది.
(3 / 6)
Day 01: తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 8.30 నిమిషాలకు జర్నీ(train no. 17417) స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది
(4 / 6)
Day 02 : ఉదయం 7.55 నిమిషాలకు నాగర్ సోల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... షిర్డీ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అనంతరం షిర్డీకి వస్తారు. హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. నాగర్ సోల్ కు చేరుకుని.. రాత్రి 09.30 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10.10 నిమిషాలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
Day 03 : మూడో రోజు రాత్రి 10.10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(5 / 6)
ఈ సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్లో సింగిల్ అక్యూపెన్సీనికి 14,940ఉండగా.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9860, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8230 చెల్లించాలి. ఇక స్టాండర్డ్ క్లాస్ లో అయితే సింగిల్ అక్యుపెన్సీకి రూ. 12120ఉండగా.. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 5400గా ఉంది.
(6 / 6)
పూర్తి వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి చూడొచ్చు. టూర్ ప్యాకేజీని బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు