(1 / 9)
(2 / 9)
ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మే 27, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
(3 / 9)
IRCTC టూరిజం. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
(4 / 9)
షెడ్యూల్ ప్రకారం… మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Train No.17230, Sabari Express.) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు. రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.
(5 / 9)
మూడో రోజు ఉదయంt ఎరవీకులం నేషన్ ప్రాక్ ను చూస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే ఉంటారు.
(6 / 9)
నాల్గో రోజు హోటల్ నుంచి బయల్దేరి…. అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు. ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(7 / 9)
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 35180, డబుల్ షేరింగ్ కు రూ.20,260 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17450గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్(3A) లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.14720గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.
(8 / 9)
ఈ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
(9 / 9)
ఈ టూర్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ఇతర గ్యాలరీలు