ఐపీఎల్ 2025 సస్పెండ్.. 6 కీలక విషయాలు.. ఉప్పల్ మ్యాచ్ టికెట్ డబ్బులు రిఫండ్-ipl 2025 suspended 6 key points sunrisers hyderabad match tickets money will be refund ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐపీఎల్ 2025 సస్పెండ్.. 6 కీలక విషయాలు.. ఉప్పల్ మ్యాచ్ టికెట్ డబ్బులు రిఫండ్

ఐపీఎల్ 2025 సస్పెండ్.. 6 కీలక విషయాలు.. ఉప్పల్ మ్యాచ్ టికెట్ డబ్బులు రిఫండ్

Published May 09, 2025 05:09 PM IST Chandu Shanigarapu
Published May 09, 2025 05:09 PM IST

ఐపీఎల్ 2025 సస్పెండ్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వారం రోజుల పాటు సస్పెండ్ చేసింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమ్ముడైన మ్యాచ్ టికెట్లను ఫ్రాంఛైజీలు రిఫండ్ చేయబోతున్నాయి. అంతే కాకుండా ఈ కీలక విషయాలపైనా ఓ లుక్కేయండి.

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ అర్ధంతరగా ఆగిపోయింది. వారం రోజుల పాటు వాయిదా పడింది. 2021లోనూ కరోనా కారణంగా సీజన్ కు మధ్యలో బ్రేక్ వచ్చింది.

(1 / 6)

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ అర్ధంతరగా ఆగిపోయింది. వారం రోజుల పాటు వాయిదా పడింది. 2021లోనూ కరోనా కారణంగా సీజన్ కు మధ్యలో బ్రేక్ వచ్చింది.

(x/IPL)

ఐపీఎల్ 2025లో 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా 16 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇందులో 12 లీగ్ దశ మ్యాచ్ లు. ఫైనల్ సహా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు.

(2 / 6)

ఐపీఎల్ 2025లో 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా 16 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇందులో 12 లీగ్ దశ మ్యాచ్ లు. ఫైనల్ సహా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు.

(x/IPL)

ఐపీఎల్ 18వ సీజన్ మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పటికే కొన్ని మ్యాచ్ లకు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు రిఫండ్ చేయబోతున్నారు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడాల్సింది. ఇక శనివారం (మే 10) ఉప్పల్ స్టేడియంలో కేకేఆర్ తో సన్ రైజర్స్ ఆడాల్సింది. ఈ మ్యాచ్ డబ్బులను రిఫండ్ చేస్తామని సన్ రైజర్స్ ప్రకటించింది.

(3 / 6)

ఐపీఎల్ 18వ సీజన్ మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పటికే కొన్ని మ్యాచ్ లకు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు రిఫండ్ చేయబోతున్నారు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడాల్సింది. ఇక శనివారం (మే 10) ఉప్పల్ స్టేడియంలో కేకేఆర్ తో సన్ రైజర్స్ ఆడాల్సింది. ఈ మ్యాచ్ డబ్బులను రిఫండ్ చేస్తామని సన్ రైజర్స్ ప్రకటించింది.

(PTI)

ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఆగిపోయే సమయానికి సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ తో ఉన్నాడు. ఈ ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ 12 ఇన్నింగ్స్ ల్లో 510 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్ (509), శుభ్ మన్ (508) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

(4 / 6)

ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఆగిపోయే సమయానికి సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ తో ఉన్నాడు. ఈ ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ 12 ఇన్నింగ్స్ ల్లో 510 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్ (509), శుభ్ మన్ (508) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

(Surjeet )

గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 20 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా 20 వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీ పేసర్ హేజిల్ వుడ్ (18) మూడో స్థానంలో ఉన్నాడు.

(5 / 6)

గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 20 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా 20 వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీ పేసర్ హేజిల్ వుడ్ (18) మూడో స్థానంలో ఉన్నాడు.

(AFP)

పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ 16 చొప్పున పాయింట్లు సాధించాయి. 11 మ్యాచ్ ల్లో ఎనిమిదేసి విజయాలు నమోదు చేశాయి. కానీ నెట్ రన్ రేట్ లో ఆర్సీబీ (0.482) కంటే గుజరాత్ (0.793) బెటర్ గా ఉంది.

(6 / 6)

పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ 16 చొప్పున పాయింట్లు సాధించాయి. 11 మ్యాచ్ ల్లో ఎనిమిదేసి విజయాలు నమోదు చేశాయి. కానీ నెట్ రన్ రేట్ లో ఆర్సీబీ (0.482) కంటే గుజరాత్ (0.793) బెటర్ గా ఉంది.

(Surjeet Yadav)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు