(1 / 6)
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ అర్ధంతరగా ఆగిపోయింది. వారం రోజుల పాటు వాయిదా పడింది. 2021లోనూ కరోనా కారణంగా సీజన్ కు మధ్యలో బ్రేక్ వచ్చింది.
(x/IPL)(2 / 6)
ఐపీఎల్ 2025లో 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా 16 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇందులో 12 లీగ్ దశ మ్యాచ్ లు. ఫైనల్ సహా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు.
(x/IPL)(3 / 6)
ఐపీఎల్ 18వ సీజన్ మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పటికే కొన్ని మ్యాచ్ లకు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు రిఫండ్ చేయబోతున్నారు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడాల్సింది. ఇక శనివారం (మే 10) ఉప్పల్ స్టేడియంలో కేకేఆర్ తో సన్ రైజర్స్ ఆడాల్సింది. ఈ మ్యాచ్ డబ్బులను రిఫండ్ చేస్తామని సన్ రైజర్స్ ప్రకటించింది.
(PTI)(4 / 6)
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఆగిపోయే సమయానికి సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ తో ఉన్నాడు. ఈ ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ 12 ఇన్నింగ్స్ ల్లో 510 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్ (509), శుభ్ మన్ (508) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
(Surjeet )(5 / 6)
గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 20 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా 20 వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీ పేసర్ హేజిల్ వుడ్ (18) మూడో స్థానంలో ఉన్నాడు.
(AFP)ఇతర గ్యాలరీలు