లక్ష గొంతుకలు ఒక్కటై.. భారత్ మాతాకీ జై.. ఆపరేషన్ సిందూర్.. త్రివిధ దళాలకు సెల్యూట్.. అదిరేలా ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ-ipl 2025 closing ceremony bcci paid tribute to indian armed forces operation sindoor shanker mahadevan ahmedabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  లక్ష గొంతుకలు ఒక్కటై.. భారత్ మాతాకీ జై.. ఆపరేషన్ సిందూర్.. త్రివిధ దళాలకు సెల్యూట్.. అదిరేలా ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ

లక్ష గొంతుకలు ఒక్కటై.. భారత్ మాతాకీ జై.. ఆపరేషన్ సిందూర్.. త్రివిధ దళాలకు సెల్యూట్.. అదిరేలా ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ

Published Jun 03, 2025 07:42 PM IST Chandu Shanigarapu
Published Jun 03, 2025 07:42 PM IST

ఐపీఎల్ 2025 క్లోజింగ్ సెర్మనీ కళ్లుచెదిరేలా సాగింది. పాకిస్థాన్ లోని ఉగ్రమూకలపై ఆపరేషన్ సిందూర్ తో చావుదెబ్బ కొట్టిన భారత వీరులకు సెల్యూట్ గా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షకు పైగా గొంతుకలు ఒక్కటై భారత్ మాతాకీ జై అంటూ నినదించాయి.

మేరే మిట్టి సాంగ్ తో మొదలైన క్లోజింగ్ సెర్మనీ ఫస్ట్ పర్ ఫార్మెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. జై హో అంటూ ఆడియన్స్ తో కేరింతలు కొట్టించింది. ఇండియా వాలే సాంగ్ తో స్టేడియం మార్మోగిపోయింది. అదే సమయంలో ఆకాశంలో విమానాలు త్రివర్ణ పతాక రంగులతో నింపేశాయి.

(1 / 5)

మేరే మిట్టి సాంగ్ తో మొదలైన క్లోజింగ్ సెర్మనీ ఫస్ట్ పర్ ఫార్మెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. జై హో అంటూ ఆడియన్స్ తో కేరింతలు కొట్టించింది. ఇండియా వాలే సాంగ్ తో స్టేడియం మార్మోగిపోయింది. అదే సమయంలో ఆకాశంలో విమానాలు త్రివర్ణ పతాక రంగులతో నింపేశాయి.

(screegrab-hotstar)

శంకర్ మహదేవన్ సింగింగ్ ఈవెంట్ గూస్ బంప్స్ తెప్పించింది. తన కొడుకులతో కలిసి ఆయన దేశభక్తి గీతాలు పాడుతుంటే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారత త్రివిధ దళాల సత్తా తెలిపే వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

(2 / 5)

శంకర్ మహదేవన్ సింగింగ్ ఈవెంట్ గూస్ బంప్స్ తెప్పించింది. తన కొడుకులతో కలిసి ఆయన దేశభక్తి గీతాలు పాడుతుంటే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారత త్రివిధ దళాల సత్తా తెలిపే వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

(PTI)

వందేమాతరం అంటూ శంకర్ మహదేవన్ గొంతెత్తితే స్టేడియం మొత్తం ఊగిపోయింది. లక్ష గొంతుకలు ఒక్కటై వందేమాతరం అంటూ గర్జించాయి.

(3 / 5)

వందేమాతరం అంటూ శంకర్ మహదేవన్ గొంతెత్తితే స్టేడియం మొత్తం ఊగిపోయింది. లక్ష గొంతుకలు ఒక్కటై వందేమాతరం అంటూ గర్జించాయి.

(PTI)

ఐపీఎల్ 2025 క్లోజింగ్ సెర్మనీ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికులు చూపిన వీరత్వాన్ని తలుచుకుంటూ అభిమానులు ఉప్పొంగిపోయాడు. భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు.

(4 / 5)

ఐపీఎల్ 2025 క్లోజింగ్ సెర్మనీ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికులు చూపిన వీరత్వాన్ని తలుచుకుంటూ అభిమానులు ఉప్పొంగిపోయాడు. భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు.

(PTI)

క్లోజింగ్ సెర్మనీ సందర్భంగా విమానాలు త్రివర్ణ పతాక రంగులు వెదజల్లుతూ ఆకాశంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత జాతీయ పతాకంతో పాటు త్రివిధ దళాల జెండాలను హెలికాఫ్టర్లు ప్రదర్శించాయి.

(5 / 5)

క్లోజింగ్ సెర్మనీ సందర్భంగా విమానాలు త్రివర్ణ పతాక రంగులు వెదజల్లుతూ ఆకాశంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత జాతీయ పతాకంతో పాటు త్రివిధ దళాల జెండాలను హెలికాఫ్టర్లు ప్రదర్శించాయి.

(screengrab-hotstar)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు