(1 / 9)
IPL 2025 Auction: ఐపీఎల్ వేలం అంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం దానిపైనే ఉంటుంది. అలాంటి వేలం నిర్వహించే బాధ్యతలను ఈసారి కూడా మల్లికా సాగర్ కు అప్పగించింది బీసీసీఐ.
(2 / 9)
IPL 2025 Auction: మల్లికా సాగర్ గతేడాది కూడా ఐపీఎల్ వేలం నిర్వహించింది. అప్పుడు ఆమె విజయవంతంగా ఈ పని చేయడంతో మెగా వేలం బాధ్యతలు కూడా ఆమెకే దక్కాయి. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో ఈ వేలం జరగనున్న విషయం తెలిసిందే.
(3 / 9)
IPL 2025 Auction: మల్లికా సాగర్ ముంబైలో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించింది. ఆమె యూఎస్ఏ నుంచి ఆర్ట్ హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కాలేజీలో హిస్టరీ చదివారు.
(4 / 9)
IPL 2025 Auction: 2001లో 26 ఏళ్ల వయసులో మల్లికా సాగర్ క్రిస్టీస్ అనే వేలం సంస్థలో తన కెరీర్ ను ప్రారంభించారు. ఐపీఎల్ లో తొలి మహిళా బిడ్డర్ గా ఆమె ఈ ఘనత సాధించింది.
(5 / 9)
IPL 2025 Auction: ఎన్నో ఆర్ట్స్ వేలం వేసిన ఘనత మల్లికా సాగర్ కు దక్కింది.
(6 / 9)
IPL 2025 Auction: 2023లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం నిర్వహించే అవకాశం దక్కించుకున్న మల్లికా సాగర్.. దానిని విజయవంతంగా ముగించింది.
(7 / 9)
IPL 2025 Auction: ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో భాగంగా మొత్తం 574 మంది ప్లేయర్స్ జాబితాలో ఉన్నారు. అందులో 208 మంది ప్లేయర్స్ ను మాత్రమే పది ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి.
(8 / 9)
IPL 2025 Auction: ఐపీఎల్ 2024 వేలంలో మల్లికా సాగర్ తొలిసారి ఆక్షనీర్ గా కనిపించింది. ఆమె ప్రొ కబడ్డీ లీగ్ లో కూడా పనిచేసింది.
(9 / 9)
IPL 2025 Auction: మల్లికా సాగర్ సుమారు 25 ఏళ్లుగా వేలం పాటలు నిర్వహిస్తోంది. ఆమె సంపద విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు కావడం విశేషం.
ఇతర గ్యాలరీలు