(1 / 5)
గురువారం (మే 8) ధర్మశాల క్రికెట్ స్టేడియం దేశభక్తి భావంతో నిండిపోయింది. జై హింద్, భారత్ మాతాకీ జై నినాదాలు మార్మోగాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు ముందు బీసీసీఐ స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది.
(x/ipl)(2 / 5)
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై వీరోచితంగా దాడి చేసిన భారత త్రిదళాలకు సెల్యూట్ గా బీసీసీఐ ఈ ఈవెంట్ నిర్వహించింది. భారత వీరులు పోరాట స్ఫూర్తి తెలిసేలా, దేశభక్తి రగిలేలా ఫేమస్ సింగర్ బి ఫ్రాక్ పాటలతో అలరించారు.
(x/ipl)(3 / 5)
‘ఆపరేషన్ సింధూర్’తో ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ మెరుపు దాడి నిర్వహించిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయానికి కారణమైన భారత వీర సైనికులకు ప్రాక్ ప్రోగ్రామ్ ట్రిబ్యూట్ గా నిలిచింది.
(x/ipl)(4 / 5)
ప్రాక్ పాటలకు తోడు కళాకారుల స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఐకానిక్ ధర్మశాల స్టేడియాన్ని ప్రాక్ హోరెత్తించారు. చిరు జల్లుల్లోనే ప్రోగ్రాం కొనసాగించారు.
(x/ipl)ఇతర గ్యాలరీలు