పైలట్పై దాడి ఘటన వెనుక ఇండిగో తన తప్పును దాచిపెడుతోంది: ప్రయాణికుడు
- పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా గత కొన్ని రోజులుగా ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు ఇండిగో పైలట్పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈసారి విమానంలోని మరో ప్రయాణికుడు ఆనాటి సంఘటనల గురించి నోరు విప్పాడు.
- పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా గత కొన్ని రోజులుగా ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు ఇండిగో పైలట్పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈసారి విమానంలోని మరో ప్రయాణికుడు ఆనాటి సంఘటనల గురించి నోరు విప్పాడు.
(1 / 5)
ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న 6ఈ 2175 విమానంలో సనల్ బీజ్ అనే ప్రయాణికుడు ఆనాటి సంఘటనలను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండిగో ఉద్యోగుల అన్ప్రొఫెషనల్నెస్ను ఆయన తన పోస్టులో ఎత్తిచూపారు. పైలట్పై దాడి ఘటన వెనుక ఇండిగో తన తప్పులను దాచిపెడుతోందని ఆయన ఆరోపించారు.
(2 / 5)
పైలట్ పై దాడి చేసినందుకు అరెస్టయిన సాహిల్ కటారియా తీరును ఖండిస్తూనే, హింస చోటు చేసుకునేంత వరకు ఇండిగో ఉద్యోగుల చర్యలు సరిగ్గాలేవని సనాల్ అన్నారు. ఆనాటి సంఘటనలను సనాల్ తన సోషల్ మీడియా పోస్ట్ లో వివరించారు. ఉదయం 7.40 గంటలకు విమానం గమ్యస్థానానికి బయలుదేరాల్సి ఉంది. చివరకు సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరింది.
(HT_PRINT)(3 / 5)
విమానం ఆలస్యమైనట్లు పైలట్ పలుమార్లు ప్రకటించారని సనల్ తెలిపారు. అయితే ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వలేదు. నిర్ణీత సమయం ముగిసిన ఐదు గంటల తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు విమానంలో ప్రయాణికులను ఎక్కించే పని ప్రారంభమైంది. అరగంటలోనే ప్రయాణికులంతా విమానంలోకి వచ్చారు. మధ్యాహ్నం 2.50 గంటల వరకు విమానం తలుపులు తెరిచే ఉంచినట్లు సనల్ పేర్కొన్నారు.
(4 / 5)
విమానాల రద్దీ కారణంగా తమకు ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని పైలట్ పదేపదే చెప్పారని సనల్ పేర్కొన్నారు. తరువాత మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నామని, త్వరలోనే విమానం టేకాఫ్ అవుతుందని ప్రకటించారు. ఇండిగో సిబ్బంది ప్రయాణికులకు నిరంతరం తప్పుడు సమాచారం ఇస్తున్నారని సనల్ ఆరోపించారు. ఏదీ స్పష్టంగా చెప్పలేదని వివరించారు.
ఇతర గ్యాలరీలు